హైదరాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిబంధనల ప్రకారమే పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షలు నిర్వహించామని… పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్వ్యూ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో కోరింది. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని కొద్ది మంది అనవసర రాద్దాంతం చేస్తున్నారని స్పష్టం చేసింది. యూజీసీ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని…. ఇకపై ఏటా పి.హెచ్.డి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు …
Read More »Blog Layout
ఏసీడి చార్జీలను రద్దు చేయాలి
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏసీడి పేరుతో ప్రజలపై వేస్తున్న అదనపు చార్జీలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఐటిఐ నుండి వర్ని చౌరస్తాలో గల విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఎస్.ఈ స్పందించకపోవడంతో ప్రజాపంథా నాయకులు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే …
Read More »డబ్బులు వచ్చే వరకు బిజెపి అండగా ఉంటుంది
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం బకాయి పడిన వడ్డీ లేని రుణాల బకాయిలు, స్రీ నిధి వడ్డీ, అభయ హస్తం డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో దోమకొండ మండలంలోని అన్ని గ్రామాల మహిళలు మండల కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు, అనంతరం ఎంపిడివో కార్యాలయానికి చేరుకుని వినతి …
Read More »కాంగ్రెస్ నేతకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
కామరెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల రైతు బందు అధ్యక్షులు గుర్జల నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ప్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఉప్పల్ వాయి గ్రామ మాజీ కారోబార్ దోనుకంటి కుమార్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పలవాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »వారం రోజుల్లోపు పోడు భూముల ప్రక్రియను పూర్తి చేయాలి
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూములకు సంబంధించిన ప్రక్రియను వారం రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని, అర్హులైన వారికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను అందించేందుకు వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మీటింగ్ హాల్లో ఆర్ఓఎఫ్ఆర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. పోడు భూములకు …
Read More »బ్యాంకు లింకేజీ రుణాలు చేపల పెంపకానికి వినియోగించుకోవచ్చు
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా రైతులు చేపల పెంపకంపై దృష్టి సారించే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సదాశివనగర్ మండలం మోడేగామ, భూంపల్లి గ్రామాల్లో మంగళవారం ఫిష్ పాండ్లను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలోని మహిళా సంఘాల నుంచి పదిమంది మహిళా రైతులను ఐకెపి అధికారులు గుర్తించి, …
Read More »టియు హ్యాండ్ బాల్ జట్ల ఎంపిక
డిచ్పల్లి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ గ్రౌండ్లో సోమవారం ఉదయం 11 గంటలకు హ్యాండ్బాల్ స్త్రీ, పురుషుల జట్ల ఎంపికలు జరిగినట్టు వర్సిటీ డైరెక్టర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డాక్టర్ సంపత్ తెలిపారు. ఎంపికల నిమిత్తం వివిధ కళాశాలల నుండి మెన్ సెలక్షన్లో 35 మంది క్రీడాకారులు, ఉమెన్ సెలక్షన్స్లో 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన …
Read More »బకాయిలు వెంటనే చెల్లించాలి
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డ్వాక్రా సంఘాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు, స్త్రీ నిధి రుణాల వడ్డీ బకాయిలు, అభయ హస్తం డబ్బులు వెంటనే విడుదల చేయాలని రాజంపేట మండల కేంద్రంలో మహిళలు పెద్దమ్మ గుడి నుండి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి ఎంపిడివో కార్యాలయం వరకు చేరుకొని ఎంపిడివోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి …
Read More »ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని …
Read More »అనారోగ్య బాధితుడికి అండగా ఎమ్మెల్యే
ఆర్మూర్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన చికిత్స పొందలేని ఒక వ్యక్తికి పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆపన్నహస్తం అందించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మిర్దాపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ షఫీ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా …
Read More »