Blog Layout

కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

బీర్కూర్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మండల పంచాయతీ అధికారి రాము అన్నారు. మండలంలోని రాములగుట్ట తండాలో శుక్రవారం గ్రామ సర్పంచ్‌ గోపాల్‌తో కలిసి పథకాన్ని ప్రారంభించారు. గ్రామంలోని కంటి సంభధిత సమస్యలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంధి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Read More »

మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఐ. టీ, పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు శనివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్‌ పర్యటనను పురస్కరించుకుని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు, అదనపు కలెక్టర్‌లు చిత్రా మిశ్రా చంద్రశేఖర్‌ లతో కలిసి ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో పాత కలెక్టరేట్‌ వద్ద …

Read More »

30న హ్యాండ్‌ బాల్‌ సెలెక్షన్స్‌

డిచ్‌పల్లి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 30వ తేదీ తెలంగాణ యూనివర్సిటీ మైదానంలో హ్యాండ్‌ బాల్‌ సెలక్షన్స్‌ నిర్వహిస్తామని వర్సిటీ క్రీడా విభాగ డైరెక్టర్‌ టి సంపత్‌ తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని యూజి, పీజీ ప్రొఫెషనల్‌ కళాశాలలో చదివే హ్యాండ్‌ బాల్‌ క్రీడాకారులు సెలక్షన్స్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. మిగతా వివరాల కోసం సంబంధిత కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌, లేదా ప్రిన్సిపాల్‌ల నుండి సమాచారం …

Read More »

బాన్సువాడ నుండి శ్రీశైలంకు పాదయాత్ర

బాన్సువాడ, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం నుండి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి శివ దీక్ష స్వాములు పాదయాత్రగా బయల్దేరి వెళ్లారు. 41 రోజులు మండలం దీక్షలు తీసుకున్న స్వాములు మాఘమాసంలో దీక్ష విరమణ చేసుకుంటారు. బాన్సువాడలో ఇరుముడి కట్టుకొని దీక్ష స్వాములు పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైల మల్లికార్జున స్వామి సన్నిధిలో ఇరుముడి చెల్లింపు చేసుకొని శివరాత్రి రోజు మాల విరమణ చేస్తారు. …

Read More »

అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

బాన్సువాడ, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ఐసిడిఎస్‌ సిడిపిఓ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లతో కలిసి సిఐటియు నాయకులు రవీందర్‌ ఖలీల్‌ ధర్నా నిర్వహించి అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడి ఉద్యోగులు పనిచేస్తారని …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం…

కామరెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కరక్‌ వాడి గ్రామానికి చెందిన సౌందర్య (30) కి గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తమై ఏ పాజిటివ్‌ పిఆర్‌ బిసి రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని చంద్రకాంత్‌ బూర్గుల్‌ గాంధారి సహకారంతో కేబీసీ బ్లడ్‌ బ్యాంకులో అందజేసినట్టు పేర్కొన్నారు. రక్తదానం చేసిన రక్తదాతకు …

Read More »

తపాలా శాఖలో భారీగా పెరిగిన వడ్డీ రేట్లు…

ఆర్మూర్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తపాలా శాఖలో కొత్త వడ్డీ రేట్ల తో ఈ నెల 28 న అన్ని పోస్టల్‌ బ్రాంచ్‌లలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించడం జరుగుతుందని తపాల శాఖ సహాయ పర్యవేక్షకురాలు యాపరు సురేఖ తెలిపారు. సురేఖ మాట్లాడుతూ… నిత్యం ప్రజలకు సేవలు అందించే తపాలా శాఖ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిందని, పలు పథకాలపై భారీగా వడ్డీ రేట్లు పెంచిందని, 28 …

Read More »

కంటివెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంటి వెలుగు శిబిరాన్ని పోలీసులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కంటి సమస్య ఉన్నవారు ఈ శిబిరం ద్వారా కంటి అద్దాలు, మందులు ఉచితంగా పొందవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్‌ ఎస్పీ అన్యోన్య …

Read More »

చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిరుధాన్యాలు వినియోగిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మార్కెట్‌ యార్డ్‌ ఆవరణలో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 సందర్భంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. చిరుధాన్యాలు ప్రజలు తీసుకోవడం వల్ల పౌష్టికాహారం అందుతుందని తెలిపారు. చిరుధాన్యాలు …

Read More »

సమీకృత కార్యాలయాల సముదాయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

నిజామాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రిపబ్లిక్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి కీలకోపన్యాసం చేశారు. జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »