నందిపేట్, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాలికి పోయే కంప ఒంటికి తగిలించుకున్నట్లు చెప్పే సామెత ప్రకారం నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామంలో ఓ సంఘటన వ్యక్తి ప్రాణం తీసింది. నందిపేట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సల్ల శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన మండ్ల కొండయ్య (42), మేస్త్రి పని చేసి వచ్చి గురువారం రాత్రి 8:30 గంటలకు తల్వేద …
Read More »Blog Layout
గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం
బోధన్, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణ లయన్స్ క్లబ్ బోధన్ బసవేశ్వర రావు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేతుల మీదుగా బోధన్ లయన్స్ క్లబ్ బసవేశ్వర …
Read More »బోధన్లో ఆరట్టు మహోత్సవం
బోధన్, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని రాకాసిపేట అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప ఆరట్టు మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆరట్టు మహోత్సవానికి బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి పాల్గొని అయ్యప్ప మాలదారులు ఏర్పాటుచేసిన ఆరట్టు ఊరేగింపు ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆరట్టు ఊరేగింపు పట్టణంలోని రాకాసిపేట్ పలువీదుల గుండా కొనసాగి పసుపు వాగు …
Read More »టియులో అంతర కళాశాలల వాలీబాల్ టోర్నమెంట్
డిచ్పల్లి, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన అంతర కళాశాలల వాలీబాల్ (బాలికల) టోర్నమెంట్లో పాల్గొనడానికి వచ్చిన వివిధ డిగ్రీ, పిజి కళాశాలల క్రీడాకారులను యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్ ఆచార్య రవీందర్ గుప్త పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైస్ఛాన్స్లర్ మాట్లాడుతూ విద్యార్థినిలు క్రీడలలో ముందుండాలని, క్రీడలు మానసిక, శారీరక వికాసానికి దోహదపడతాయన్నారు. అనంతరం విజేతలకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ …
Read More »అనాధ వృద్ధురాలికి వంట సామాగ్రి అందజేత
కామారెడ్డి, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలంలోని యాడవరం గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ అనాధ వృద్ధ మహిళకు వంట సామాగ్రి, పూరి గుడిసెల్లో నివాసముంటున్న రెండు నిరుపేద కుటుంబాలకు టార్పలిన్లు, శివారు రాంరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడికి హైజిన్ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ …
Read More »స్వయం సహాయక సంఘాలకు రూ.529.25 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు
కామారెడ్డి, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 9038 స్వయం సహాయక సంఘాలకు రూ.529.25 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఐకెపి అధికారులతో బ్యాంకు లింకేజీ రుణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 15 వేల 319 స్వయం సహాయక సంఘాలకు రూ.854.80 కోట్లు బ్యాంక్ లింకేజీ …
Read More »రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆర్మూర్, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలానికి చెందిన బేగరి పెద్ద రాజన్న కుమారుడు బేగరి రాజు (32) గురువారం రాత్రి 10:30 నిమిషాలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం… మాక్లూర్ మండలం గుత్ప గ్రామం నుండి ఆలూర్ వైపు వస్తుండగా మార్గమధ్యలో ఉన్న వాగు వంతెన రాయికి అదుపు తప్పి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి …
Read More »తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం
కామారెడ్డి, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 19 నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం కామారెడ్డి పట్టణంలో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం సర్వే చేసే అంశాలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులు వాస్తవాలు తెలపాలని సూచించారు. తప్పుడు సమాచారం ఇస్తే చట్టం ప్రకారం చర్యలు …
Read More »రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం పట్టివేత
ఎడపల్లి, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రం శివారులోని సాటాపూర్ గేటు వద్ద నిజామాబాదు నుంచి బోధన్కు అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యం వాహనాన్ని గురువారం ఉదయం టాస్కుఫోర్స్ అధికారులు, ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ వైపు నుంచి టాటా బొలెరో వాహనంలో బోధన్కు బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు నిఘా వేసి అక్రమ పిడీఎస్ బియ్యం సుమారు …
Read More »గల్ఫ్లో కుర్నపల్లి వాసి ఆత్మహత్య
ఎడపల్లి, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకు దెరువు కోసం దేశాన్ని విడిచి గల్ఫ్లోని ఖతర్కు వెళ్లిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్న ఘటన ఎడపల్లి మండలంలోని కుర్నపల్లి గ్రామంలో చోటు చేసుకొంది. స్థానికుల వివరాలిలా ఉన్నాయి… గ్రామానికి చెందిన వామనచారి (44) అనే వ్యక్తి ఉపాధి కోసం గల్ఫ్లోని ఖతర్ వెళ్ళాడని ఈ క్రమంలో తాను నివసిస్తున్న గదిలో …
Read More »