Blog Layout

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

నిజామాబాద్‌, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పాత జిల్లా కలెక్టర్‌ కార్యాలయ భవనాల సముదాయము, క్రీడ మైదానము, ఇతర ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు అప్పగించోద్దని డిమాండ్‌ చేస్తూ సీపీఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నిజామాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీపీఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్‌ అధ్యక్షత వహించారు. ఈ …

Read More »

జాన్కంపేట్‌లో విషాదం

ఎడపల్లి, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్‌ గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతుంది. పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద సంఘటన బుధవారం రాత్రి గ్రామంలో చోటుచేసుకోగా గురువారం ఉదయం వెలుగు …

Read More »

లక్ష్య సాధన దిశగా అంకిత భావంతో కృషి చేయాలి

నిజామాబాద్‌, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్‌ పాం పంట సాగు పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ, వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ వ్యవసాయ, ఉద్యానవన, తదితర శాఖల అధికారులతో ఆయిల్‌ పాం పంట సాగుపై సమీక్ష జరిపారు. జిల్లాలో …

Read More »

అసంపూర్తిగా ఉన్న పనులు త్వరగా పూర్తిచేయాలి

కామారెడ్డి, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బృహత్‌ పల్లె ప్రకృతి వనాల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. నిజాంసాగర్‌ తాసిల్దార్‌ కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న …

Read More »

ఆర్మూర్‌ పట్టణం గాఢ నిద్రలో ఉన్నవేళ

ఆర్మూర్‌, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాత్రి పదకొండు గంటల సమయం …. ఆర్మూర్‌ పట్టణము గాఢ నిద్రలో వున్న సమయములో … ఆర్మూర్‌ పట్టణములోని కొత్త బస్టాండ్‌ సమీపములో రెండు కార్లు వచ్చి ఆగాయి …. కార్లలోనుంచి దాదాపు ఎనిమిది మంది తమ చేతుల్లో దుప్పట్లు పట్టుకుని దిగి అటూఇటూ చూసారు రోడ్డు పక్క ఏ దిక్కు లేని అభాగ్యులు, యాచకులు, వృద్దులు కొందరు …

Read More »

పనుల్లో పురోగతి కనిపించకపోతే కఠిన చర్యలు

నిజామాబాద్‌, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్‌ గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఖలీల్వాడిలో నూతనంగా నిర్మించతలపెట్టిన వెజ్‌-నాన్‌ వెజ్‌ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ స్థలాన్ని, అహ్మదీ బజార్‌ వద్ద ఖిల్లా రోడ్డును ఆనుకుని …

Read More »

జనవరి 4 నుంచి పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.సి.ఎ., ఎం.బి.ఎ., ఎల్‌.ఎల్‌.ఎం., ఎల్‌.ఎల్‌.బి., 5 సంవత్సరాల ఇంటిగ్రేటేడ్‌ (ఎ.పి.ఇ., ఐ పి.సి.హెచ్‌., ఐ.ఎం.బి.ఎ.) పీజీ కోర్సులకు చెందిన ఒకటవ, మూడవ సెమిస్టర్స్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు, ఏపిఇ, పిసిహెచ్‌ (5 సంవత్సరాల ఐపిజిపి) ఎనిమిదవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ రెగ్యులర్‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ …

Read More »

26 నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి

నిజామాబాద్‌, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను ఈ నెల 26 వ తేదీ నాటికి పరిశీలన ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 8 వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి …

Read More »

70 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు కావలెను

నిజామాబాద్‌, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంటి వెలుగు కార్యక్రమంలో ఔట్‌సోర్సింగ్‌ పద్దతిలో డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేయటానికి 70 మంది కావాలని, వీరు ఏదేని డిగ్రీ అర్హత కలిగి, కంప్యూటర్‌ కోర్సులో డిసిఎ / పిజిడిసిఎ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత దృవీకరణ పత్రాలు (విద్యార్హత, కుల, బోనోఫైడ్‌తోపాటు రెండు పాస్‌పోర్టు …

Read More »

పారదర్శకమైన తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పారదర్శికమైన తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి వికాస్‌ రాజు అన్నారు. బుధవారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్‌ జాబితాలో చోటు కల్పించాలని సూచించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు ద్వారా స్వీకరించిన దరఖాస్తులను ఓటర్‌ జాబితాలో తక్షణమే నమోదు చేయాలని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »