Blog Layout

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం అనీమియా వ్యాధితో బాధపడుతున్న అయేషా తబస్సుం (24) గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా బి నేగిటివ్‌ రక్తం అవసరం కావడంతో పాల్వంచ గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నవీన్‌కు తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.టి.ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో 16వ సారి రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ …

Read More »

మహమ్మద్‌ నగర్‌ను మండలం చేయాలి

నిజాంసాగర్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మహమ్మద్‌ నగర్‌ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని నిజాంసాగర్‌ మండల కాంగ్రేస్‌ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రేస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ నారాయణకు మెమోరండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ మహమ్మద్‌ నగర్‌ను నూతన మండలంగా ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. కార్యక్రమంలో …

Read More »

ఘనంగా మల్లన్నస్వామి కళ్యాణోత్సవం

నిజాంసాగర్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలో రెండు రోజులుగా కొనసాగుతున్న మల్లన్న కళ్యాణోత్సవ వేడుకల్లో సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీ మండల సీనియర్‌ నాయకులు దుర్గా రెడ్డి, వైస్‌ ఎంపీపీ మనోహర్‌, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్‌ గౌడ్‌, మాగి సర్పంచ్‌ అంజయ్య పాల్గొన్నారు. అనంతరం వారికి ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు బేగరి రాజు, …

Read More »

హ్యాండ్‌బాల్‌ జట్టు ఎంపిక

ఆర్మూర్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర హ్యాండ్‌ బాల్‌ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్‌. పవన్‌ కుమార్‌ ఆదేశాల మేరకు సోమవారం ఆర్మూర్‌ విజయ్‌ హై స్కూల్‌లో నిజామాబాద్‌ హ్యాండ్‌బాల్‌ జిల్లా సీనియర్‌ మెన్‌ జట్టు సెలక్షన్స్‌ నిర్వహించారు. సెలక్షన్స్‌కు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుండి దాదాపు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను నిజామాబాద్‌ జిల్లా …

Read More »

పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన

నిజామాబాద్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని ఓటరు జాబితా పరిశీలకులు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ బి.మహేష్‌ దత్‌ ఎక్కా సూచించారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టర్‌ సి.నారాయణరెడ్డితో కలిసి ఇందల్వాయి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతున్న పోలింగ్‌ బూత్‌ను సందర్శించారు. …

Read More »

సదాశివనగర్‌లో వైద్య శిబిరం

కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశినగర్‌ మండలం భూంపల్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 300 మందికి గుండె సంబంధిత వ్యాధులు, షుగర్‌, బిపి సంబంధించి పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేశారు. నిజామాబాద్‌ పట్టణానికి చెందిన ప్రతిభ హాస్పిటల్‌ యాజమాన్యం భూంపల్లిలో క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ నవ్య వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో వైద్య …

Read More »

నెలాఖరు నాటికి ఐ.టీ హబ్‌ పూర్తి చేయాలి

నిజామాబాద్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి (న్యూ కలెక్టరేట్‌) సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఐ.టీ హబ్‌ పనులను సోమవారం నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గ శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తాతో కలిసి కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనుల ప్రగతిని పరిశీలించి సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులకు, కాంట్రాక్టరుకు కీలక సూచనలు చేశారు. ఈ …

Read More »

ఆధార్‌ అనుసంధానం వేగవంతం చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక ఓటర్‌ సవరణ జాబితా -2023 రూపకల్పనలో అర్హత గల ప్రతి ఒక్కరు ఓటర్‌గా నమోదు అయ్యేవిధంగా చూడాలని ఎన్నికల అబ్జర్వర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో ఎన్నికల అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సదరం డాటా తో దివ్యాంగుల ఓటర్ల జాబితాను సరిపోల్చి అర్హత ఉంటే ఓటర్‌గా నమోదు చేయాలని …

Read More »

ఈ నెల 16, 17 తేదీలలో వాలీబాల్‌ టోర్నమెంట్‌ కం సెలక్షన్‌

డిచ్‌పల్లి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ అంతర కళాశాలల వాలీబాల్‌ (స్త్రీ పురుషులు) టోర్నమెంట్‌ కం సెలక్షన్‌ ఈ నెల 16, 17 తేదీలలో యూనివర్సిటీ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని వర్శిటీ క్రీడా విభాగపు డైరెక్టర్‌ డా. సంపత్‌ తెలిపారు. టోర్నమెంట్‌లో పాల్గొనువారు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీ.జి., ప్రొఫెషనల్‌ కళాశాలల్లో నుండి కళాశాలకు ఒక్కో టీమ్‌ పాల్గొనవచ్చని, టోర్నమెంట్‌ నిర్వహించడం వర్సిటీలో …

Read More »

ప్రజావాణికి 59 ఫిర్యాదులు

నిజామాబాద్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 59 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »