Blog Layout

కొనసాగుతున్న క్షేత్రస్థాయి పరిశీలన

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సర్వీస్‌ ట్రైనీ అధికారుల (అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌) క్షేత్రస్థాయి పరిశీలన జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శిక్షణలో భాగంగా గ్రామ స్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ట్రైనీ అధికారుల బృందం అక్టోబర్‌ 31 న జిల్లాకు చేరుకున్న విషయం విదితమే. ఈ నెల 4 వ తేదీ వరకు ట్రైనీ అధికారుల బృందాలు వారికి కేటాయించిన …

Read More »

ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి లేదు

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనందున అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ గురువు స్థానానికి ఉన్న గౌరవాన్నిమరింతగా ఇనుమడిరపజేయాలని పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ …

Read More »

ఘనంగా ఎంపీ బీబీ పాటిల్‌ జన్మదిన వేడుకలు

నిజాంసాగర్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ నాయకులు మాజీ సీడీసీ చైర్మన్‌ పట్లోళ్ల దుర్గారెడ్డి, కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మనోహర్‌, సీడీసీ చైర్మన్‌ గంగారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్‌ గౌడ్‌, సర్పంచ్‌ కమ్మరి కత్త అంజయ్య, …

Read More »

ముద్ద చర్మవ్యాధి రాకుండా అవగాహన కల్పించాలి

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముద్ద చర్మవ్యాధిపై అవగాహన గోడ ప్రతులను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆవిష్కరించారు. పశువైద్యాధికారులు గ్రామాల్లోని రైతులకు ముద్ద చర్మవ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ భరత్‌, జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దయానంద్‌, …

Read More »

పీఎంపీ వైద్యుల ఆధ్వర్యంలో ధన్వంతరీ పూజ

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామంలో సాయిబాబా ఆలయం వద్ద పి.ఎం.పి వైద్యుల అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ కామారెడ్డి ఆధ్వర్యంలో పి.ఎం.పి వైద్యుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా పిఎంపి వైద్యుల రాష్ట్ర నాయకులు పుల్గం మోహన్‌, రవి వర్మ విచ్చేశారు. అనంతరం ధన్వంతరి పూజా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పుల్గం మోహన్‌, రవి …

Read More »

కల్కి భగవాన్‌ ఆలయంలో అన్నదానం…

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కల్కి ఆలయంలో గత మూడు సంవత్సరాలుగా ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని నేడు కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయ సేవకులు ఏర్రం విజయ్‌, సిద్ధంశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ శ్రీ అమ్మ భగవానుల సూచనల మేరకు 2020 సంవత్సరంలో అన్నదాన కార్యక్రమాన్ని ఆలయంలో ప్రారంభించడం జరిగిందని నిర్విరామంగా గత మూడు సంవత్సరాల …

Read More »

వసతి గృహాలు తనిఖీ చేసిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని షెడ్యూల్‌ కులాల బాలుర వసతి గృహాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. వసతి గృహం లో ఉన్న గదులను, మరుగుదొడ్లను చూశారు. వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సమీకృత బాలికల సంక్షేమ వసతిగృహ సముదాయాన్ని తనిఖీ చేశారు. వంటశాలను, భోజనశాలను పరిశీలించారు. …

Read More »

పిచ్చికుక్క దాడిలో 20 మందికి గాయాలు

బోధన్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ మండలం లంగ్డాపూర్‌ గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. పిచ్చి కుక్క జనాలపై దాడి చేస్తూ కనబడ్డవారిని కరిచేస్తూ తీవ్ర ఆందోళన కలిగించింది. పిచ్చికుక్క దాడిలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు వారి బందువులు హాజరు …

Read More »

సమాచార శాఖ (ఏ.ఆర్‌.ఈ) ఏఈఐఈకి ఘనంగా వీడ్కోలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ (ఏ.ఆర్‌.ఈ) విభాగంలో సహాయ ఎగ్జిక్యూటివ్‌ సమాచార ఇంజనీర్‌ (ఏఈఐఈ)గా విధులు నిర్వర్తించి సోమవారం పదవీ విరమణ చేసిన వీ.కరుణశ్రీనివాస్‌ కుమార్‌కు ఆ శాఖ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. దాదాపు ముప్పై సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించిన కుమార్‌, ఏడాదిన్నర కాలం పాటు ఇంకనూ తన సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ …

Read More »

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును పరిశీలించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును నిశితంగా పరిశీలించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అఖిల భారత సర్వీసుల ట్రైనీ అధికారులకు సూచించారు. తమ శిక్షణలో భాగంగా క్షేత్ర స్థాయిలో వివిధ అంశాల అధ్యయనం కోసం నిజామాబాద్‌ జిల్లాకు కేటాయించబడిన అఖిల భారత సర్వీసుల ట్రైనీ అధికారుల బృందం సోమవారం సమీకృత …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »