Blog Layout

ప్రజావాణికి 72 ఫిర్యాదులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 72 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జెడ్పి సీఈఓ గోవింద్‌లకు విన్నవిస్తూ అర్జీలు …

Read More »

దేశ సమైక్యతకు చిహ్నం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత దేశపు ఐక్యతకు చిహ్నంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ దేశ చరిత్రలో చిర స్థాయిలో నిలిచిపోతారని ఏసిపి వెంకటేశ్వర్లు అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఐక్యతా పరుగును 7వ పోలీసు బెటాలియన్‌ కమాండెంట్‌ శ్రీనివాసరావుతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న …

Read More »

మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే..

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న టేక్రియాల్‌ గ్రామానికి చెందిన నారాయణరావుకు అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ క్రియాశీలక సభ్యుడు పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన పెంజర్ల సురేష్‌ రెడ్డి వెంటనే స్పందించి పట్టణంలోని మెడికల్‌ ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న లింగాపూర్‌ గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి సహకారంతో ఏ …

Read More »

ఆలయ భూమిపై కబ్జా కన్ను

కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కున్నారు… ఇలాంటి సంఘటన కామారెడ్డి మండలం ఉగ్రవాయిలో చోటు చేసుకుంది. గత 10 సంవత్సరాల క్రితం గ్రామస్తులందరూ ఏకమై శివాలయం కోసం భూమిని కేదార్నాథ్‌ అనే పీఠాధిపతిపై గ్రామస్తులు అందరు కలిసి సర్వే నెంబర్‌ 155/9 లో ఒక ఎకరం 13 గుంటల భూమిని సర్వే నెంబర్‌ …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, అక్టోబర్ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి న్యాయం …

Read More »

వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పథకాలు షెడ్యూల్డ్‌ కులాల వారికి అందే విధంగా మానిటరింగ్‌ కమిటీ ప్రతినిధులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు సోమవారం షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలోని షెడ్యూల్డ్‌ కులాల వారికి …

Read More »

జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేసిన అధికారులు

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత ప్రతిజ్ఞను చేపట్టారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ ప్రతిజ్ఞ చదివి వినిపించారు. జిల్లా ఉద్యోగులు ముందుకు చేతులు చాచి …

Read More »

నాపా అధ్యక్షులు కర్నాటి ఆంజనేయులును కలిసిన వీసీ

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో నార్త్‌ అమెరికా పద్మశాలి అసోసియేషన్‌ అధ్యక్షులు కర్నాటి ఆంజనేయులును మర్యాద పూర్వకంగా కలిసి శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరల్డ్‌ వీవర్స్‌ ఆర్గనైజేషన్స్‌ చైర్మన్‌ (డబ్ల్యూడబ్ల్యూఒ) గా ఉన్న కర్నాటి ఆంజనేయులు ఆధ్వర్యంలో శనివారం నారాయణ గూడలోని పద్మశాలి భవనంలో …

Read More »

58 ఏళ్ళు నిండిన భవనిర్మాణ కార్మికులకు పెన్షన్‌ ఇవ్వాలి

బోధన్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవన నిర్మాణ కార్మికులకు 58 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 500 రూపాయల పెన్షన్‌ ఇవ్వాలని ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కోటగిరి మండల కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎ. విటల్‌ గౌడ్‌ అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య హాజరై మాట్లాడారు. …

Read More »

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

రెంజల్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన లోక్‌ అదాలత్‌ ఇన్వెస్టిగేషన్‌ డైరెక్టర్‌ వెంకటరావు, ప్రముఖ వైద్యుడు జీవన్‌ రావుల సోదరుడు నర్సింగరావు మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని, మౌలాలి తాండా సర్పంచ్‌ సునీత బాబునాయక్‌ తండ్రి మరణించడంతో వారి కుటుంబాన్ని శనివారం రాత్రి ఎమ్మెల్యే షకీల్‌ పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ మనోధైర్యాన్ని నింపారు. ఆయన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »