Blog Layout

సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజికవర్గంలోని దోమకొండ, కామారెడ్డి మండలాలకు చెందిన 32 మందికి 32 లక్షల 3 వేల 712 రూపాయల కళ్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఆనంతరం కామారెడ్డి నియోజికవర్గంలోని 14 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 18 లక్షల 64 వేల 500 రూపాయల చెక్కులను ఆయన …

Read More »

సేంద్రీయ సాగు పంటలకు మంచి డిమాండ్‌..

ఎడపల్లి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సేంద్రీయ సాగు లాభదాయకంగా వుంటుందని, దిగుబడి కొంత తగ్గినా లాభాలు మాత్రం ఎక్కువగా ఉంటాయని పలువురు రైతు నేస్తం, నాబార్డ్‌ ప్రతినిధులు తెలిపారు. సేంద్రియ సాగులో పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్‌ వుందని, సేంద్రియ సాగు కొంచెం కష్టమైనా పలితాలు బాగుంటాయని, ప్రస్తుత సమాజంలో రసాయన ఎరువులతో పండిరచిన పంటల కంటే సేంద్రీయ సాగులో పండిరచిన పంటలకు డిమాండ్‌ …

Read More »

సామాన్యులతో సభాపతి

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం పద్మాజివాడి చౌరస్తా వద్ద తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బాన్సువాడ నుండి హైదరాబాద్‌ బయలుదేరి పద్మాజివాడి చౌరస్తా వద్ద రైతులని చూసి తన వాహనాన్ని ఆపారు. అక్కడే రైతులతో వున్న మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్‌ రావుతో కాసేపు మాట్లాడి అతి సామాన్యులు వెళ్లే చిన్న హోటల్‌లో వెళ్లి రైతులకు అల్పాహారం చేపించారు. …

Read More »

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌ వెంట పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా సైతం పరీక్షా కేంద్రాలను సందర్శించారు.జిల్లా కేంద్రంలోని కాకతీయ కళాశాలలోని రెండు ఎగ్జామ్‌ సెంటర్లను, గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన …

Read More »

కామారెడ్డిలో జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల క్షేత్ర పర్యటన

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంను ఆదివారం హైదరాబాద్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా సందర్శించారు. కలెక్టరేట్‌ భవనం మ్యాప్‌ను పరిశీలించారు. భవనంలోని వివిధ డిపార్ట్మెంట్ల భవనాలను చూశారు. అనంతరం సమావేశం మందిరంలో ఆర్‌ అండ్‌ బి డి ఈఈ జాలిగామ శ్రీనివాస్‌, ఏఈఈ రవితేజ, వక్త ఉష రెడ్డి సముదాయంలో ఉన్న …

Read More »

కామారెడ్డిలో 81.60 శాతం హాజరు నమోదు

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌ -1 ప్రాథమిక పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్కే డిగ్రీ కళాశాల, సందీపని జూనియర్‌ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాలలో బయోమెట్రిక్‌, సీసీ కెమెరాలు నిర్వహణ ప్రక్రియను …

Read More »

రెండు ఆర్టీసీ బస్సులు డీ, ప్రయాణికులకు గాయాలు

మాక్లూర్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని మాక్లుర్‌ మండలం చిన్నాపూర్‌ అర్బన్‌ పార్క్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సులు మరో ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న మాక్లుర్‌ ఎస్సై యాదగిరి గౌడ్‌ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తమ పోలీసు వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన వారిని 108 …

Read More »

ఘనంగా బోనాల పండుగ

రెంజల్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని రెంజల్‌, దూపల్లి, సాటా పూర్‌, బొర్గం, తాడ్‌ బిలోలి, కునేపల్లి, బాగేపల్లి, కళ్యాపూర్‌ గ్రామాలలో ఆదివారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. గ్రామంలోని గ్రామదేవతలకు మహిళలు నెత్తిన బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతియేటా గ్రామంలోని గ్రామదేవతలకు బోనాలను సమర్పించడం ఆనవాయితీ. వేడుకలో సర్పంచ్‌లు రమేష్‌ కుమార్‌, …

Read More »

చిరుధాన్యాల పంటలతో అధిక లాభాలు

ఎడపల్లి, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంట మార్పిడి చేసి నూతన పద్ధతుల్లో చిరుధాన్యాలను పండిరచడానికి రైతులు ముందుకు రావాలని చిరుధాన్యాల పంటలతో అధిక దిగుబడులు సాధించి అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్‌ అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన మహిళా కిసాన్‌ దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు …

Read More »

కంటి వైద్య శిబిరానికి చక్కని స్పందన…

రెంజల్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మండలంలోని వివిధ గ్రామాల నుండి అధికసంఖ్యలో కంటి సమస్యలున్న వారు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. 130 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 38 మందికి మోతి బిందు ఆపరేషన్‌ కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »