హైదరాబాద్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర రోడ్లు భవనాలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలు హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాలపై సమీక్షించారు. ఉమ్మడి జిల్లాకు మరిన్ని పంచాయతీరాజ్ …
Read More »Blog Layout
డెంగ్యూ బాధిత బాలుడికి ప్లేట్లేట్స్ అందజేసిన డాక్టర్ వేదప్రకాష్..
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్జె వైద్యశాలలో పట్టణానికి చెందిన రోహన్ అనే బాలుడు డెంగ్యూ వ్యాధితో ఓ పాజిటివ్ ప్లేట్ లేట్ల సంఖ్య 20వేలకు పడిపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల, ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేద …
Read More »వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మూడు రోజులపాటు జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సి ఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సులో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. ఈనెల 16, 17,18 తేదీలలో ఉత్సవాలను జరపాలని సూచించారు. 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులు, మహిళలతో ర్యాలీలో నిర్వహించాలని పేర్కొన్నారు. 17న జిల్లా కేంద్రాల్లో …
Read More »నులి పురుగుల నివారణ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా బుధవారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని కలెక్టర్ సి.నారాయణరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీలో విద్యార్థులతో పాటు కలెక్టర్ సైతం భాగస్వాములయ్యారు. 1 – 19 సంవత్సరాల వయస్సు గల వారందరికీ నులి పురుగుల నివారణ …
Read More »తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విమోచన ప్రాధాన్యతను చాటేలా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను జిల్లాలో విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. వజ్రోత్సవాల నిర్వహణకు సంబంధించి మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ …
Read More »కామారెడ్డిలో విమోచన ఉత్సవాలు
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17 న విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జన్మభూమి రోడ్డులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటురి శ్రీకాంత్ మాట్లాడుతూ 1947 ఆగస్ట్ 15న భారత దేశానికి స్వాతత్య్రం వచ్చినప్పటికీ నిజాం సంస్థానం …
Read More »జాతీయ స్థాయి అవార్డుల సాధనకు కృషి చేయాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులను నిజామాబాద్ జిల్లా ఎక్కువ సంఖ్యలో సాధించేలా ఆయా శాఖల అధికారులు సమిష్టిగా, పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 9 అంశాల ప్రాతిపదికన …
Read More »విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) నగర నిర్మాణ జనరల్ బాడీ సమావేశం నగరంలోని కోటగల్లి, ఎన్ఆర్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యవక్తగా విచ్చేసిన సీనియర్ జర్నలిస్ట్, అధ్యాపకుడు, పి.డి.ఎస్.యు మాజీ జిల్లా కార్యదర్శి కొంగర శ్రీనివాస్ రావు మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో …
Read More »ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకోవాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకోవాలని కలెక్టర్ సీ.నారాయణరెడ్డి గర్భిణీలకు సూచించారు. మోపాల్ వసతి గృహం ఆకస్మిక తనిఖీ చేసి తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంగా 102 అంబులెన్సులో గర్భిణీ మహిళలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు జరిపించేందుకు తీసుకెళ్తుండడాన్ని గమనించిన కలెక్టర్ వాహనాన్ని నిలిపి, ఆశా వర్కర్లకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలతో కూడిన ఉచిత …
Read More »రెసిడెన్షియల్ స్కూల్… వసతి గృహం తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండలం కంజర గ్రామంలో గల ప్రభుత్వ సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, మోపాల్ లోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా కంజర రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించిన కలెక్టర్, అన్ని విభాగాలను నిశితంగా పరిశీలించారు. కిచెన్, డార్మెటరీ, స్టోర్ రూమ్, టాయిలెట్స్ వద్ద గల వసతులను స్వయంగా …
Read More »