నందిపేట్, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల ఎస్ఐగా సల్ల శ్రీకాంత్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఎస్ఐగా కొనసాగిన మురళిని 2 నెలల క్రితం జిల్లా పోలీసు కార్యాలయానికి అటాచ్ చేశారు. అప్పటి నుండి రెండవ ఎస్ఐగా ఉన్న అరిఫుద్దీన్ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. జిల్లా పోలీస్ కమిషనర్ నాగరాజు ఆదేశాల మేరకు ఆర్మూర్లో రెండవ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాంత్ బదిలీపై …
Read More »Blog Layout
బిజెపి నేతలు లాజిక్ మరిచిపోయారు…
నిజామాబాద్, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2014 కన్నా ముందు చాలా మంది నాయకులు వచ్చారు పోయారనీ, 50 ఏళ్ళలో జరగని అభివృద్ధి తెలంగాణ వచ్చాక కెసిఆర్ నిజామాబాద్ నగరానికి నిధులిచ్చి అభివృద్ధి చేయిస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల …
Read More »రూర్బన్ పనులపై సమీక్ష
కామారెడ్డి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ శృతి శరన్, డిప్యూటీ సెక్రటరీ నివేదితకు బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ స్వాగతం పలికారు. కేంద్ర బృందం ప్రతినిధులు జనహిత గణేష్ మండలి …
Read More »ఎమ్మెల్సీ కవితను కలిసిన తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు
నిజామాబాద్, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7 లక్షల మంది బీడి కార్మికులు పనిచేస్తున్నారని, కార్మికులందరికీ చేతినిండా పని లేదని, నెలలో 10 లేక 12 రోజులు పని మాత్రమే లభిస్తుందని, ఈ పరిస్థితులలో 2014 సంవత్సరంలో పార్లమెంటు ఎన్నికల్లో నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పని చేస్తున్న బీడీ కార్మికులందరికీ జీవన భృతి ఇచ్చి ఆదుకుంటానని హామీ …
Read More »కామారెడ్డిలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బృందం పర్యటన
కామారెడ్డి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జుక్కల్ మండలం మమ్మద్ బాద్లో రూర్బన్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జెయింట్ సెక్రెటరీ శృతి శరన్, డిప్యూటీ సెక్రటరీ నివేదిత పరిశీలించారు. 400 మెట్రిక్ టన్నుల గిడ్డంగిని, గోపాలమిత్ర కేంద్రాన్ని, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. గోదాం నిర్మించడం వల్ల కలిగిన ప్రయోజనాలను రైతులను …
Read More »అంతర్జాతీయ క్రీడాపోటీలకు ఎంపికైన మంజీర విద్యార్థి
కామారెడ్డి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీర డిగ్రీ కళాశాలకు చెందిన ఎమ్.డి ఈష్యక్ బిఎస్సి న్యూట్రీషియన్ అంతర్జాతీయ స్థాయిలో సాఫ్ట్ క్రికెట్ టీమ్కి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంజీర కళాశాల చైర్మన్ గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి మధ్యప్రదేశ్లో జాతీయ స్థాయిలో ఆడి అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం కామారెడ్డి జిల్లాకే గర్వకారణం అని తెలిపారు. పోటీలు నేపాల్లో 28 …
Read More »మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ శృతి శరన్ అన్నారు. జుక్కల్ ఆడిటోరియంలో బుధవారం మహిళా సంఘాల ప్రతినిధులతో ఆమె మాట్లాడారు. మహిళలు స్వయం ఉపాధి పొందాలని సూచించారు. రూర్బన్ పథకం ద్వారా కుట్టు శిక్షణ నేర్చుకున్నామని మహిళలు తెలిపారు. బ్యూటిషన్, మగ్గం వర్క్ నేర్పించాలని కోరారు. …
Read More »శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన కలెక్టర్, సీపీ
నిజామాబాద్, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాలతో కలిసి కలెక్టర్ బుధవారం వినాయక శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా, అక్కడి నుండి మొదలుకుని గుర్బాబాదీ రోడ్, లలితమహల్ థియేటర్, గంజ్, గాంధీచౌక్, పవన్ థియేటర్, …
Read More »డెంగ్యూ బాధితునికి ప్లేట్ లేట్స్ అందజేత
కామారెడ్డి, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రం అశోక్ నగర్ కాలనీకి చెందిన స్వామి (28) యువకుడికి డెంగ్యూ వ్యాధితో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండడంతో అతనికి అత్యవసరంగా బి పాజిటివ్ ప్లేట్లెట్స్ అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త అండ్ ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ నిర్వాహకుడు డాక్టర్ బాలును …
Read More »లాఠీ చార్జికీ నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నిజామాబాద్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యారంగ సమష్యలు, నిరుద్యోగుల సమష్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్లో ముఖ్యమంత్రి కెసిఆర్ కాన్వాయ్ని అడ్డగించిన పిడిఎస్యు నాయకులపై లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను గిరిరాజ్ కళాశాలలో దగ్దం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పి.డి.ఎస్.యు. జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ కల్పన మాట్లాడారు. ఈరోజు నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో విద్యా రంగంపై చర్చించి, సమస్యల …
Read More »