కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లలో గురువారం సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ సండే పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌడ జాతి సంక్షేమం కోసం సర్దార్ పాపన్న గౌడ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం ప్రతినిధులు లింగా …
Read More »Blog Layout
ఒత్తిడిని జయించేందుకు క్రీడలు దోహదపడతాయి
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వృత్తిపరమైన ఒత్తిడిని జయించేందుకు క్రీడలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా యువజన సర్వీసులు క్రీడల శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని కోరారు. ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ …
Read More »ఆకర్షణీయమైన చేతిరాతపై విద్యార్థులకు శిక్షణ
నిజామాబాద్, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి పేరిట నెలకొల్పిన చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేతిరాతను అందంగా, ఆకర్షణీయంగా ఎలా మల్చుకోవాలనే దానిపై శిక్షణ అందించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిది, పదవ తరగతుల విద్యార్థులకు గురువారం స్థానికంగానే ఆర్మూర్ పట్టణంలో …
Read More »క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయి
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కళాభారతిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేసే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. క్రీడల వల్ల వివిధ గ్రామాల క్రీడాకారుల మధ్య స్నేహభావం పెరుగుతుందని సూచించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్తో కలిసి జిల్లా …
Read More »మిల్లింగ్ ప్రారంభించని రైస్ మిల్లపై చర్యలు
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మిల్లింగ్ ప్రారంభించని రైస్ మిల్ యజమానులపై చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లు బుధవారం రైస్ మిల్లుల యజమానులు, డిప్యూటీ తహసిల్దార్లతో మిల్లింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. కస్టమ్స్ మిల్లింగ్ రైస్ఎఫ్సిఐకి త్వరగా పంపించి నిర్ణీత గడువులోగా మిల్లింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో సివిల్ సప్లై డిఎం …
Read More »జిల్లా ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన వైద్య అమృతరావు
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ఫెడరేషన్ నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న బార్ అసోసియేషన్ బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బుధవారం కామారెడ్డి జిల్లా ఫెడరేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వైద్య అమృత రావు (కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు), ఉపాధ్యక్షులు పండరి (ఎల్లారెడ్డి …
Read More »ప్రాంగణ నియామాకల్లో 9 మంది ఎంపిక
నిజామాబాద్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేర్ డిగ్రీ కళాశాలలో ముథూట్ ఫైనాన్స్ కార్పోరేషన్ వారు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 9 మంది అబ్యర్థులకు ఉద్యోగాలు వచ్చాయని కేర్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ తెలిపారు. ఎన్నికైన అభ్యర్థులకు ఆన్రోల్ ఉద్యోగం వెంబడే ఇస్తామని ముత్తుట్ ఫైనాన్స్ రీజియనల్ మేనేజర్ కొండ ఉపేందర్ తెలిపారు. కార్యక్రమంలో కేర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణ, ప్రతినిధి కొయ్యాడ …
Read More »ఉర్దూలో మీర్ అబేద్ అలీకి డాక్టరేట్
డిచ్పల్లి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉర్దూ విభాగంలో పరిశోధక విద్యార్థి మీర్ అబేద్ అలీకి పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష) ను బుధవారం ఉదయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని మిని సెమినార్ హాల్లో నిర్వహించారు. ఉర్దూ పాఠ్యప్రణాళికా సంఘ చైర్మన్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. …
Read More »టీయూ ఇంచార్జి రిజిస్ట్రార్గా బి. విద్యావర్ధిని
డిచ్పల్లి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఇంచార్జి రిజిస్ట్రార్ గా వృక్షశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ బి. విద్యావర్ధిని మంగళవారం నియమింపబడ్డారు. దీనికి సంబంధించిన ఆర్డర్ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ చేతుల మీదుగా బుధవారం అందుకున్నారు. ఆచార్య బి. విద్యావర్ధిని ప్రస్తుతం ఆడిట్ సెల్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇది వరకు కూడా ఆమె రిజిస్ట్రార్గా కొంత …
Read More »ఈ దేశానికి నేనేమీ ఇవ్వాలి అనే భావన ఉండాలి
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో భారత స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేశ్ వి పాటిల్ మాట్లాడుతూ ఈ దేశం నాకేమిచ్చిందని కాకుండా ఈ దేశానికి నేనేమి ఇవ్వాలనే భావన నేటి సమాజంలో ఉండాలని, రక్తదానం చేయడం …
Read More »