నందిపేట్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ఆలూరు గ్రామం నుండి వెల్మల్ గ్రామం మద్యమార్గంలో ఉన్న కల్వర్టు కొట్టుకపోవడం జరిగింది. దీంతో ఆర్మూర్ వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణీకుల రాక పోకలకు ఇబ్బంది కలుగకుండా నందిపేట్ వైస్ ఎంపీపీ దేవేందర్ బ్లేడ్ ట్రాక్టర్ సాయంతో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ చదును చేశారు. ప్రజల ఇబ్బందులు …
Read More »Blog Layout
త్రిపుల్ ఐటి బాసర విద్యార్ధులకు అఖిలపక్ష నేత సంఫీుభావం
నిజామాబాద్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : త్రిపుల్ ఐటి బాసర విద్యార్థులకు రాష్ట్ర అఖిల పక్షం నేతలు సంఫీుభావం తెలిపారు. బాసర విద్యార్థులు విష ఆహారానికి గురైన దరిమిలా నిజామాబాద్ హోప్ ఆసుపత్రికి పలువురు నేతలు వచ్చి పరామర్శించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ హోప్ ఆసుపత్రిని సందర్శించి ఫుడ్ పాయిజన్కు గురైన విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా …
Read More »యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలి
నిజామాబాద్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న సదుపాయాలను పునరుద్ధరించేందుకు ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల ప్రగతిని కలెక్టర్ సి నారాయణ రెడ్డి శనివారం సమీక్షించారు. సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఆర్అండ్బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వ్యవసాయ, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులను క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక్కో శాఖ …
Read More »కస్తూర్బా పాఠశాల పరిశీలన
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం టేక్రియాల్లోని కస్తూరిబా పాఠశాలను శుక్రవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే పరిశీలించారు. పాఠశాల, వసతి గృహం పరిసరాలను చూశారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. పరిశుభ్రత పాటించాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో డిఇఓ రాజు, ఉపాధ్యాయునులు పాల్గొన్నారు.
Read More »రాజంపేట రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో టర్పాలిన్లు, హైజినిక్ కిట్ల అందజేత
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట మండలంలో గత 5 రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లను గుర్తించి ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాకు అందజేసిన టర్పాలిన్లు, హైజినిక్ కిట్లను నష్టపోయిన వారికి శుకవ్రారం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సూచనల మేరకు రెడ్ క్రాస్ బృందాలు వివిధ గ్రామాల్లో ఇల్లు కోల్పోయిన …
Read More »జాతీయ స్థాయిలో ఉస్మానియా విశ్వ విద్యాలయానికి గుర్తింపు
హైదరాబాద్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ స్థాయిలో ఉస్మానియా విశ్వివిద్యాలయం మరో గుర్తింపు సాధించింది. జాతీయ స్థాయి విద్యాసంస్థలు, యూనివర్శిటీల జాబితాలో తనస్థానాన్ని మరింత మెరుగు పరుచుకుంది. గతేడాదితో పోలిస్తే పది స్థానాలు మెరుగుపరుచుకుని 22వ స్థానాన్ని సాధించింది. 2022కు గాను కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేసిన అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో చోటు సంపాందించుకుంది. మొత్తం ఐదు విభాగాల్లో ఆయా …
Read More »రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలి
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం రోడ్డు భద్రతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని సూచించారు. ఇటీవల కురిసిన భారీ …
Read More »మళ్ళీ వస్తే అప్రమత్తంగా ఉండాలి
వేల్పూర్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు,నాయకులతో శుక్రవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ లోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశ మయ్యారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలకు తమ తమ గ్రామాల్లో దెబ్బతిన్న చెరువులు, పంచాయితీ రాజ్ మరియు ఆర్అండ్బి పరిధిలోని రోడ్లు,బ్రిడ్జిలు, కల్వర్టులు …
Read More »పునరావాస చర్యలకు 101 సభ్యుల సైనిక బృందం
హైదరాబాద్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసేందుకు గాను భారత సైన్యానికి చెందిన 101 మందితో కూడిన బృందం పునరావాస చర్యలలలో పాల్గొంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు సహకరించాల్సిందిగా భారత …
Read More »25 నుంచి వీఆర్ఏల సమ్మె
నందిపేట్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్ర వీఆర్ఎల జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు సమ్మె చేపట్టనున్నట్లు శుక్రవారం నందిపేట్ వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ అనీల్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. గ్రామానికి సంబంధించిన విధులు నిర్వహిస్తామని, ఇతర విధులు నిర్వర్తించబోమని వారు తెలిపారు. ఈ నెల 25 నుంచి …
Read More »