నిజామాబాద్, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విజిట్ వీసాపై వెళ్లిన ఒక యువకుడిని బహరేన్ ఎయిర్ పోర్టులో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి తండాకు చెందిన బనావత్ చక్రవర్తి ఈనెల 27వ తేదీన ‘గల్ఫ్ ఏర్’ ప్లయిట్ జిఎఫ్-275 ద్వారా హైదరాబాద్ నుండి బహరేన్కు వెళ్ళాడు. ఎయిర్ పోర్టులోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అతన్ని ఎందుకు నిలిపివేశారో కారణాలు తెలియడం లేదు. సహాయం …
Read More »Blog Layout
ప్లాస్టిక్ వస్తువులకు స్వస్తి పలకాలి
కామారెడ్డి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్లాస్టిక్ కవర్లు, వస్తువులకు స్వస్తి పలకాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ప్లాస్టిక్ నిషేధంపై టాస్కుఫోర్సు అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడితే దుకాణాల యజమానులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పేపర్, వస్త్రం, జనపనారతో తయారుచేసిన సంచులు …
Read More »పీఆర్ఓ డైరెక్టర్గా డా. త్రివేణి
డిచ్పల్లి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో గల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రజా సంబంధాల అధికారి డా. వి. త్రివేణి ప్రజా సంబంధాల కార్యాలయానికి డైరెక్టర్గా నియామకం పొందారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ నియామక పత్రానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. గురువారం వీసీ చేతుల మీదుగా డా. వి. త్రివేణి …
Read More »సిం ఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
నందిపేట్, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలం బజార్ కొత్తూరు గ్రామంలో గురువారం సిరికొండ లక్ష్మికి సీ.ఎం. రిలీఫ్ ఫండ్ చెక్కును తెరాస నాయకులు అందించారు. నాయకులు మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో ఎంతోమంది పేద వ్యాధిగ్రస్తులకు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. ఎంఎల్ఏ జీవన్ రెడ్డి పేద ప్రజలకు ఆపద్బాంధవుడిగా ఉన్నాడని కీర్తించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంద పోసాని బాబు రాజ్, …
Read More »మున్సిపల్ కార్మికులకు పీఆర్సీ చెల్లించాలి
నిజామాబాద్, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్పోరేషన్లో 2021లో నియమించిన 330 మంది కార్మికులకు పీఆర్పీ అమలు చేయాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్-బిఎల్ టీయూ రాష్ట్ర అద్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. గురువారం యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్పోరేషన్ పరిదిలో 330 మంది కార్మికులను మున్సిపల్ కార్పోరేషన్ నియమించిందన్నారు. …
Read More »అధునాతన యంత్రాలతో రేషన్ పంపిణీ సులభతరం
కామారెడ్డి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎదురవుతున్న నెట్వర్క్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్తగా 4జి నెట్వర్క్తో కూడిన విజన్ టెక్ కంపెనీ ఈ – పాస్ మిషన్లు, హై రిస్ మిషన్ యంత్రాలను అమల్లోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అధునాతన ఈ- పాస్ మిషన్లు, హై రిస్ మిషన్ యంత్రాలలో రేషన్ పంపిణీ …
Read More »ప్లాస్టిక్ కవర్లను నియంత్రించాలి
బోధన్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నియంత్రించాలని బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మశారత్ రెడ్డి అన్నారు. బుధవారం బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వ్యాపారస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడారు. జూలై నుంచి ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులపై దేశవ్యాప్తంగా నిషేధం అమలులోకి వచ్చిందన్నారు. ముఖ్యంగా తక్కువ పరిమాణం కలిగిన ప్లాస్టిక్ వస్తువులు క్యారీ …
Read More »పశువుల అక్రమ రవాణా నిరోధానికి గట్టి నిఘా
నిజామాబాద్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా కొనసాగించాలని అదనపు కలెక్టర్ బీ.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బక్రీద్ వేడుకను పురస్కరించుకుని అదనపు కలెక్టర్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో బుధవారం పశువుల అక్రమ రవాణా నిరోధంపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని అంతర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన కందకుర్తి, …
Read More »ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు
నిజామాబాద్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2021-22 విద్యా సంవత్సరంలో నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు మంచి ఫలితాలతో తమ సత్తా చాటారని కళాశాల ప్రిన్సిపల్ నుసరత్ జహాన్ తెలిపారు. మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో జిల్లా స్థాయిలో తమ కళాశాల బాలికలు మంచి మార్కులు సాధించారని ప్రిన్సిపల్ వివరించారు. రెండవ సంవత్సరంలో ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని …
Read More »గణాంక సర్వే పారదర్శకంగా చేపట్టాలి
కామారెడ్డి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణాంక సర్వేను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో బుధవారం 16వ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా జిల్లా ముఖ్య ప్రణాళిక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పి. సి. మహా లానోబిస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. …
Read More »