ఆర్మూర్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో 45 సిసి కెమెరాలను సిపి నాగరాజు ప్రారంభించారు. బుధవారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సిసి కెమెరాలను సిపి కే ఆర్ నాగరాజు ప్రారంభించారు. గ్రామస్తులను ద్దేశించి సిపి నాగరాజు మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేర నియంత్రణకు ఎంతగానో దోహద పడ్తాయన్నారు. గ్రామంలో ప్రతి ఇంటీకి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు …
Read More »Blog Layout
కలెక్టరేట్లో ఘనంగా గణాంక దినోత్సవ వేడుకలు
నిజామాబాద్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో బుధవారం గణాంక దినోత్సవ (స్టాటిస్టిక్స్ డే) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య ప్రణాళిక కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. గణాంక పితామహుడు పీసీ.మహలనోబిస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎలాంటి ప్రణాళిక …
Read More »జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం
నిజామాబాద్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం (డీఎంఏసి) బుధవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన ఆయన ఛాంబర్లో జరిగింది. ఆయా ప్రింట్ / ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు 2022 -2024 సంవత్సరాలకు సంబంధించి జారీ చేయవలసిన కొత్త అక్రిడిటేషన్ కార్డుల విషయమై సమావేశంలో కలెక్టర్ నేతృత్వంలో కమిటీ సభ్యులు క్షుణ్ణంగా చర్చించిన మీదట …
Read More »ఆరుగురు విద్యార్థుల డిబార్
డిచ్పల్లి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు …
Read More »రేపు పాలిసెట్ – సర్వం సిద్ధం
నిజామాబాద్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 21 పరీక్షా కేంద్రాలలో 30వ తేదీ గురువారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించే పాలిసెట్ ` 2022 పరీక్షకు 7008 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు జిల్లా సమన్వయ కర్త శ్రీరాం కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. విద్యార్థులు ఉదయం 10 గంటలలోపు …
Read More »అటెండెన్స్ యాప్ ఆధారంగానే జీతాల చెల్లింపు
నిజామాబాద్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్యారోగ్య శాఖలో జిల్లా స్థాయి అధికారి మొదలుకుని కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఉద్యోగికి అటెండెన్స్ యాప్ ఆధారంగానే జీతాల చెల్లింపులు జరగాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు భిన్నంగా ఎవరికైనా జీతాలు మంజూరు చేస్తే, సంబంధిత డీ.డీ.ఓల నుండి ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం …
Read More »సేంద్రీయ ఎరువులతో అధిక దిగుబడులు
ఎడపల్లి, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు నాట్లు వేసే ముందు రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి భాస్వరంతో కూడిన పిఎస్బి సేంద్రియ ఎరువులను వాడినట్లయితే పంట దిగుబడి అధికంగా ఉంటుందని బోధన్ ఏడిఏ సంతోష్ అన్నారు. ఎడపల్లి మండలం అంబం (వై) గ్రామంలో మంగళవారం మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వానకాలం పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడిఏ సంతోష్ …
Read More »అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పది - విసి రవీందర్ గుప్త
కామారెడ్డి, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గల రక్తనిధి కేంద్రంలో మంగళవారం రెడ్క్రాస్, ఐవిఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దాచేపల్లి రవీందర్ గుప్తా జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో భాగంగా 28 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టియు వైస్ ఛాన్సలర్ దాచేపల్లి రవీందర్ గుప్తా మాట్లాడుతూ అన్ని దానాలలో …
Read More »12 గంటల పని విధానం రద్దు చేయాలి
నిజామాబాద్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్మికులకు 12 గంటల పని విధానం రద్దు చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడారు. మోడీ ప్రభుత్వం జులై ఒకటో తేదీ నుండి …
Read More »అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
మాక్లూర్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మాక్లుర్ మండలం గొట్టుముక్కల గ్రామంలో అప్పుల వారి వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఎస్సై యాదగిరి గౌడ్ కథనం మేరకు కారం నడిపి భూమన్న (51) ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్ఐ అన్నారు.
Read More »