కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను గురువారం కేంద్ర బృందం సందర్శించింది. లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం రికార్డులను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన సిమెంట్ రోడ్లను పరిశీలించారు. రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన నిధుల వివరాల రికార్డులు చూశారు. పల్లె ప్రకృతి వనం, కోతుల ఆహార కేంద్రం సందర్శించారు. …
Read More »Blog Layout
వైభవంగా ముగిసిన ప్రతిష్ఠాపన పర్వం
నందిపేట్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి ఆలయంలో గడిచిన ఆరు రోజుల పాటు కన్నుల పండువగా సాగిన ప్రతిష్ఠాపన మహోత్సవం సుసంపన్నమైంది. భక్తులు ఆహ్లాదకర వాతావరణంలో స్వామి వారి తొలి దర్శనం చేసుకుని పులకించి పోయారు. ఆరవ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రాణప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠించబడిన రాజ్యలక్ష్మి సమేత నరసింహుడు, …
Read More »నారాయణ కళాశాలకు గుర్తింపు లేదు
నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పట్టణంలోని ఆర్యనగర్లో నారాయణ జూనియర్ కాలేజ్ (కార్పొరేట్) పేరిట ఇంటర్మీడియట్లో అడ్మిషన్లు తీసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఈ కళాశాలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఇంతవరకూ ఎలాంటి గుర్తింపు లేదని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ గురువారం స్పష్టం చేశారు. నారాయణ కాలేజ్ (కార్పొరేట్) పేరిట ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను అపోహలకు గురిచేస్తూ …
Read More »తొలకరి పలకరింపు
నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం తెల్లవారుజామున తొలకరి జల్లు పలకరించి పరవశింపజేసింది. సాధారణంగా మృగశిర కార్తె రోజు తప్పకుండా వర్షం కురుస్తుందని భావిస్తారు. కాగా బుధవారం సాయంత్రం ఈదురుగాలులు వీచినప్పటికి వాన జాడ కానరాలేదు. కానీ తెల్లవారేసరికి వరుణుడు కరుణించాడు. రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్లో పలుచోట్ల వాన ముసురుపట్టినట్టుగా కురుస్తూనే ఉంది. మరోవైపు వాతావరణ శాఖ కూడా మూడురోజులు …
Read More »పేషంట్ వెంట ఒక్క అటెండెంట్నే అనుమతించాలి
నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు బోధన్, ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రుల్లో ఇన్ పేషంట్ల వెంట ఒక అటెండెంట్ ను మాత్రమే అనుమతించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో ప్రభుత్వాసుపత్రుల పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపారు. ఎక్కువ సంఖ్యలో సహాయకులు ఉండడం వల్ల ఇతర అనేక రకాల ఇబ్బందులు ఉత్పన్నం అవుతున్నందున ఈ …
Read More »ఋణ విస్తరణలో లోన్లు మంజూరు చేశారు
నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా బుధవారం లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో వినాయక్ నగర్ బస్వా గార్డెన్లో ఋణ విస్తరణ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని అన్ని బ్యాంకులు కార్యక్రమంలో పాల్గొని వివిధ రకాల బిజినెస్ లోన్, వ్యవసాయ రుణాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లకు గృహ, కార్ లోన్లు మంజూరు చేశారు. లీడ్ బ్యాంకు అధికారి ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో …
Read More »విద్యా ప్రమాణాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యా ప్రమాణాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ఎస్ఎంసి కమిటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్ అధికారులతో మన ఊరు- మన బడి కార్యక్రమంలో చేపడుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మన ఊరు- మన బడి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం …
Read More »మన ఊరు – మన బడి అమలులో నిజామాబాదు జిల్లా ఆదర్శం
నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి కార్యక్రమం అమలులో నిజామాబాద్ జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక …
Read More »బ్యాంకు రుణాలు ఉపయోగించుకోవాలి
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హత గల లబ్ధిదారులకు రుణ సదుపాయం అందించడంలో బ్యాంకులు ముందంజలో ఉంటాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాల్లో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రజా చేరువ రుణ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు, వ్యాపారవేత్తలు బ్యాంకు రుణాలు ఉపయోగించుకొని …
Read More »ప్రణాళిక బద్దంగా చదివితే ఐఏఎస్ సాధించడం సులువే
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టుదలతో ప్రణాళికాబద్దంగా చదివితే సివిల్స్ సాధించడం సులభమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆర్కె డిగ్రీ, పీజీ కళాశాలలో బుధవారం గ్రూప్స్, సివిల్స్ సిలబస్పై జిల్లా కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర కృషి వల్ల విద్యార్థులు పరీక్షలు రాసి విజయాన్ని సాధించవచ్చని సూచించారు. ఇష్టపడి ఐఏఎస్ సాధించిన వివరాలను తెలిపారు. …
Read More »