నిజామాబాద్, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుండి నేరుగా నిజామాబాద్కు చేరుకున్న ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీసీపీ వినీత్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గోవింద్, ఆర్డీవో రవి తదితరులు …
Read More »Blog Layout
ఇంటర్ పరీక్షలో ఇద్దరిపై మాల్ప్రాక్టీస్ కేసు
నిజామాబాద్, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ పరీక్షల్లో ఎనిమిదవరోజు శనివారం రెండవ సంవత్సరం గణితశాస్త్రం-2, జువాలజీ-2, హిస్టరీ-2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. శనివారం జరిగిన పరీక్షల్లో జిల్లాలో ఇద్దరు విద్యార్థులు కాపి చేస్తుండగా మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తం 14,631 మంది విద్యార్థులకు గాను 662 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా …
Read More »పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్
కామారెడ్డి, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని శ్రీ సాందీపని జూనియర్ కళాశాల, మైనార్టీ బాలికల వసతి గృహంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ప్రశ్నపత్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్ లను పరిశీలించారు. పరీక్షలు సజావుగా నిర్వహించాలని సూచించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు తనిఖీలు చేయాలని కోరారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు …
Read More »సోదర భావం పెంపొందించేందుకే ఈద్ మిలాప్
నందిపేట్, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని మస్జిద్ మౌజా బింతే అలీ ప్రాంగణంలో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన జమాత్ ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షుడు మంజూర్ మోహిఉద్దీన్ మాట్లాడారు. ప్రజలలో సోదర భావం పెంపొందించడమే లక్ష్యంగా జమాత్ ఇస్లామి హింద్ భారత దేశం అంతట ఈద్ మిలాప్ కార్యక్రమం ఏర్పాటు చేసి భిన్న మతాల ప్రజలను …
Read More »ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు
నిజామాబాద్, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామని, ఇకపై నూటికి నూరు శాతం ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రగతి భవన్లో ఐసీడీఎస్ అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో …
Read More »పరీక్షకు 649 మంది గైర్హాజరు
నిజామాబాద్, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో శుక్రవారం ఇంటర్ పరీక్షల్లో ఒకరి పై మాల్ప్రాక్టీస్ కేసు నమోదు కాగా 649 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. ఏడవ రోజు శుక్రవారం మొదటి సంవత్సరం గణిత శాస్త్రం-1, జువాలజీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. శుక్రవారం మొత్తం 14,984 మంది విద్యార్థులకు గాను 649 మంది విద్యార్థులు గైర్ హాజరు కాగా …
Read More »చిన్నారులకు పౌష్టికాహారం అందజేయాలి
కామారెడ్డి, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. చిన్నారుల బరువు, ఎత్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేని పిల్లలను గుర్తించి వారికి అదనంగా పౌష్టికాహారం అందించాలని సూచించారు. గర్భిణీలు, తల్లులను అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న …
Read More »కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు అందజేయాలి
కామారెడ్డి, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను తక్షణమే ట్యాబ్లో ఎంట్రీ చేయాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం సహకార సంఘాల కార్యదర్శులు, ఉప తహసీల్దార్లతో దాన్యం కొనుగోళ్ల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి విక్రయించాలని …
Read More »పిహెచ్.డి. నోటిఫికేషన్ ఫీజు గడువు పొడిగింపు
డిచ్పల్లి, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో డీన్ ఆచార్య పి. కనకయ్య ఆధ్వర్యంలో గత నెల ఏఫ్రిల్ 13 వ తేదీన పిహెచ్. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 1 నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. కాగా ఫీజు గడువు ఈ నెల 14 తేదీ వరకు చివరి తేదీ ఉండగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు …
Read More »ఫ్రీ కోచింగ్ సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్ ఎగ్జామ్స్తో పాటు పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువతీ, యువకులకు ప్రభుత్వం తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వరంలో అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ఇప్పటికే ఆన్లైన్ మెరిట్ టెస్ట్ ప్రాతిపదికన ఎంపికైన అభ్యర్థులకు ముందస్తు శిక్షణ తరగతులు …
Read More »