డిచ్పల్లి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ సోమవారం ఉదయం పర్యవేక్షించారు. వివిధ విభాగాలను సందర్శించి అధ్యాపకులు, విద్యార్థుల హాజరు శాతాన్ని తెలుసుకున్నారు. విద్యార్థుల హజరు శాతాన్ని పెంపొంచడం కోసం బోధనోపకరణాలను ప్రదర్శించాలని అన్నారు. విద్యార్థుల చదువు సంధ్యలో పోటీ తత్త్వాన్ని పెంపొందింపజేయాలని అన్నారు. ఆయా తరగతి గదుల్లో జరుగుతున్న పాఠ్య బోధనను …
Read More »Blog Layout
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్లకు విన్నవిస్తూ అర్జీలు …
Read More »భక్తులు సహకరిస్తే లింబాద్రిగుట్ట ప్రాంతాన్ని సుందరీకరిస్తాం…
భీమ్గల్, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్కు 5 కి.మీ. ల దూరంలో ఉన్న దక్షిణ బద్రీనాథ్గా కొలువుదీరిన లింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి లింబాద్రి గుట్ట పైన ఇంతకు పూర్వం నిర్మించిన వాణిజ్య దుకాణ సముదాయంలో మూడు షెటర్లలో ఒక్క షెటర్ దాతలు వారి పూర్వీకుల పేర్ల మీద దివ్య ఆశీస్సులతో నిర్మాణ వ్యయం ఆర్థిక సహాయం చేసి వారి పేరు మీద దానం …
Read More »ప్రభుత్వ పథకాలపై జర్నలిస్ట్లకు శిక్షణ
నిజామాబాద్, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి తెలంగాణ షెడ్యూల్డు కులాల సహకార అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 26 , 27 వ తేదీలలో షెడ్యూల్డ్ కులాల జర్నలిస్టుల ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 26, …
Read More »ముఖ్యమంత్రి చొరవతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు
నిజామాబాద్, మార్చ్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చొరవ చూపిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా భర్తీ చేయనున్న 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలలో 95 శాతం కొలువులు స్థానికులకే దక్కనున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి …
Read More »వ్యవసాయ విస్తీర్ణాధికారిని అభినందించిన కలెక్టర్
కామారెడ్డి, మార్చ్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హర్యానా రాష్ట్రంలోని తావ్ దేవి లాల్ ఖేల్ స్టేడియం పంచ్కులలో జరుగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2021- 2022 సందర్భంగా దానికి సంబంధించిన జీవోను సర్వీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు శనివారం విడుదల చేశారు. గేమ్స్కు కామారెడ్డి జిల్లా నుంచి కామారెడ్డి రూరల్, జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారులు సంఘం అధ్యక్షుడు కె. శ్రీనివాస్ …
Read More »అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
కామారెడ్డి, మార్చ్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అభివృద్ధి పనులను మార్చ్ 30 లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిమెంట్ రోడ్ల నిర్మాణం పనులు అధికారులు సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. నిజాంసాగర్ …
Read More »యువతులు ఆర్థిక స్వావలంబన సాధించాలి
కామారెడ్డి, మార్చ్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువతులు శిక్షణ కేంద్రం ద్వారా నైపుణ్యాలను పెంచుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శనివారం డిఆర్డిఎ ఆధ్వర్యంలో (ఈడబ్ల్యూఆర్ఎస్) ఉన్నతి ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శిక్షణలో మెళుకువలు నేర్చుకొని యువతులు జీవితంలో స్థిరపడాలని సూచించారు. ఉద్యోగాలు …
Read More »డ్రోన్ స్ప్రేయర్ల పనితీరుపై మరింత లోతుగా అధ్యయనం
నిజామాబాద్, మార్చ్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డ్రోన్ స్ప్రేయర్ల పనితీరుపై మరింత లోతుగా అధ్యయనం చేసి, వాటి ఫలితాలను కూలంకషంగా పరిశీలన జరిపిన తరువాతనే యూనిట్ల స్థాపన కోసం ముందుకెళ్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. దళిత కుటుంబాలను ఆర్థికంగా అభ్యున్నతి బాటలో పయనింపజేయాలనే బృహత్తర సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకం అమలు చేస్తున్న విషయం విధితమే. ఈ పథకం మొదటి విడతలో …
Read More »హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం
నిజామాబాద్, మార్చ్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి శనివారం నిజామాబాద్ పర్యటనకు హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లా కోర్టు భవన సముదాయంలో న్యాయాధికారులతో హైకోర్టు జడ్జి జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ముందుగా ఆయన స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం …
Read More »