నిజామాబాద్, మార్చ్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్లను భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ.ఎఫ్.టీ.యు) ఆధ్వర్యంలో శ్రామిక భవన్, కోటగల్లిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజా, కార్మిక, రైతు …
Read More »Blog Layout
జల వనరులను కాపాడుకోవడం మనందరి బాధ్యత
కామారెడ్డి, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లైట్ ఫర్ బ్లైండ్ సంస్థ నాబార్డు వారి సహకారముతో ప్రపంచ జల దినోత్సవం కార్యక్రమం ముందస్తుగా చిట్యాల గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. నీటి ప్రాముఖ్యతను వివరిస్తు జల వనరులను కాపాడుకోవడం మనందరి భాద్యత అని, నీటిని చాలా చాలా పొదుపుగా వాడాలని సంస్థ కార్యదర్శి నబి వివరించారు. సర్పంచ్ కవిత, బాలయ్య మాట్లాడుతూ తమ పంచాయితి పరిధిలో నీటి …
Read More »గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో డెలివరీ నిమిత్తమై ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం బ్లడ్ బ్యాంకులలో లభించకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహం సహకారంతో ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటరమణకు తెలిపారు. వెంటనే స్పందించి రక్తాన్ని సకాలంలో అందజేసి గర్భిణీ స్త్రీ ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ …
Read More »కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు
కామారెడ్డి, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం హోలీ వేడుకలు జిల్లా ఉద్యోగుల సంక్షేమ సంఘం, ఉద్యోగ జేఏసీ, టిఎన్జిఓఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఉద్యోగులు హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు మర్యాదపూర్వకంగా కలిసి పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. …
Read More »జిల్లా ప్రజలకు ప్రముఖుల హోళీ శుభాకాంక్షలు
నిజామాబాద్, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు హోళీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. దినదినాభివృద్ధి సాధిస్తూ, అభివృద్ధి పథాన అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలు, ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Read More »12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ వ్యాక్సినేషన్
కామారెడ్డి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఉన్న 12 నుంచి పద్నాలుగేళ్ల వయసు ఉన్న పిల్లలందరికీ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వారి తల్లిదండ్రులు చేయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి జూమ్ కాన్ఫరెన్సులో వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 12 నుండి 14 ఏళ్ళ లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ వారి …
Read More »కళాశాల కరపత్రాల ఆవిష్కరణ
కామారెడ్డి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రత్యేకతలు, విశిష్టతను తెలిపే కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం ఆవిష్కరించారు. ఆరు దశాబ్దాలుగా కామారెడ్డి డిగ్రీ కళాశాల చేస్తున్న కృషిని, కళాశాలలో ఉన్న వసతులు వివరిస్తూ రూపొందించిన కరపత్రం చూసి కళాశాల యాజమాన్యాన్ని కలెక్టర్ అభినందించారు. కరపత్రాన్ని ప్రిన్సిపాల్ కె. కిష్టయ్య ఆధ్వర్యంలో అధ్యాపక బృందం సమీకృత …
Read More »ఉద్యోగుల సేవలను గుర్తించిన సిఎం
కామారెడ్డి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐకెపి, సెర్ప్, మెప్మా కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయాన్ని ఆశిస్తూ జేఏసీ, టిఎన్జిఓఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ ఉద్యోగుల చైర్మన్ నరాల వెంకట్ రెడ్డి మాట్లాడారు. సెర్ప్, ఐకెపి, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలను …
Read More »బాయిల్డ్ కస్టమర్ రైస్ మిల్లింగ్ 31 లోపు పూర్తి చేయాలి
కామారెడ్డి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాయిల్డ్ కస్టమర్స్ రైస్ మిల్లింగ్ మార్చి 31 లోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం రైస్ మిల్లు యజమానులతో యాసంగి దాన్యం మిల్లింగ్పై సమీక్ష నిర్వహించారు. లక్ష్యానికి అనుగుణంగా రైస్ మిల్లు యజమానులు ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని సూచించారు. రైస్ మిల్లుల వారీగా జరిగిన మిల్లింగ్ వివరాలను …
Read More »ప్లాట్ల వేలం ద్వారా రూ.34.19 కోట్ల ఆదాయం
కామారెడ్డి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్ ప్లాట్ల వేలం ద్వారా రూ.34.19 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి గెలాక్సీ ఫంక్షన్ హాల్లో గురువారం ధరణి టౌన్ షిప్ ఫ్లాట్ల వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మొత్తం 230 ప్లాట్లకు వేలం వేయగా 217 ప్లాట్లు విక్రయించినట్లు చెప్పారు. మొదటిరోజు 62, …
Read More »