కామారెడ్డి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో గురువారం టి ఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. క్షేత్ర సహాయకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారని జిల్లా క్షేత్ర సహాయకుల సంఘం అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. తాము చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి తిరిగి విధుల్లోకి …
Read More »Blog Layout
ఈఎస్ఐ సౌకర్యాలు పొందడం కార్మికుల హక్కు
నిజామాబాద్, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో కార్మికులకు ఈ.ఎస్.ఐ అందిస్తున్న సౌకర్యాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సుకు ఐ.ఎఫ్.టీ.యు జిల్లా నాయకులు ఎం.సుధాకర్ అధ్యక్షత వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన ఈ.ఎస్.ఐ జిల్లా మేనేజర్ మాల్యాద్రి గారు మాట్లాడుతూ కార్మికులకు ఈఎస్ఐ కల్పిస్తున్న సౌకర్యాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కష్టకాలంలో కార్మికులను …
Read More »22న లెక్చరర్ పోస్టులకు రాత పరీక్ష
డిచ్పల్లి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన వివిధ విభాగాలలోని ఆయా సబ్జెక్టుల్లో పార్ట్ – టైం లెక్చరర్ పోస్టులకు గాను ఈ నెల 22 వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 12 వరకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, తెలంగాణ యూనివర్సిటి, డిచ్ పల్లిలో వ్రాత పరీక్ష నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి …
Read More »పాఠశాలలను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల ఉర్దూ మీడియం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, అర్సపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం సందర్శించారు. మన ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి కార్యక్రమం మొదటి విడత కింద ఎంపికైన వాటిలో ఈ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో …
Read More »ఆర్ఐకి సన్మానం
కామారెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ తహశీల్ కార్యాలయానికి బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించిన ఆర్ఐ బాలకిషన్ను మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇప్పటిదాకా తహశీల్ కార్యాలయంలో ఆర్ఐగా పని చేసి బదిలీపై వెళ్తున్న అంజయ్యను కూడా శాలువాతో ఘనంగా సన్మానించారు. బదిలీపై వెళ్తున్న ఆర్ఐ అంజయ్య సేవలను …
Read More »కామారెడ్డి జిల్లా గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా గోపిగౌడ్
కామారెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ గౌడ సంఘం కామారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉప్పలవాయి గోపి గౌడ్ నియమితులయ్యారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ మేరకు నియామక పత్రాన్ని ఆబ్కారీ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ అందజేశారు. ఈ సందర్బంగా గోపి గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, …
Read More »గూడెంలో పశువైద్య శిబిరం
కామారెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం కామారెడ్డి మండలం గూడెంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ గ్యారా లక్ష్మిసాయిలు, వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డి మార్కెట్ కమిటీ నుండి సుమారు 20,000 రూపాయల మందులను గూడెం గ్రామంలో ఉన్న ఆవులు, గేదెలు, మేకలు మరియు గొర్లకు ఎలాంటి వ్యాధులు ప్రబల కుండా …
Read More »ప్రత్యక్ష వేలం ద్వారా రూ. 30.37 కోట్ల ఆదాయం
కామరెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం అడ్లూరు శివారులోని ధరణి టౌన్షిప్లోని ప్లాట్ల ప్రత్యక్ష వేలం ద్వారా రూ.30.37 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రామారెడ్డి రోడ్డులోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో బుధవారం ప్రత్యక్ష వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గత మూడు రోజుల నుంచి గెలాక్సీ ఫంక్షన్ హాల్లో ప్రత్యక్ష …
Read More »పంటలను పరిశీలించిన వ్యవసాయధికారి
గాంధారి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలంలో వరి, మొక్కజొన్న పంటలను వ్యవసాయధికారి నరేష్ బుధవారం పరిశీలించారు. మండలంలోని ముదోలి గ్రామ పరిధిలోని వరిలో కాండం తొలిచే పురుగు, ఆకుముడుత, జింక్ లోపాన్ని గుర్తించినట్లు తెలిపారు. వీటి నివారణకు కార్టప్ హైడ్రో క్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాన్ ట్రయినిలిప్రోల్ 60 మి.లి. వేప నూనెలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలనీ రైతులకు సూచించారు. …
Read More »కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
గాంధారి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గాంధారి మండలం హేమ్లానాయక్ తండాలో మంగళవారం చోటుచేసుకుంది. సదాశివనగర్ సిఐ రామన్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హేమ్లానాయక్ తండాకు చెందిన వివాహిత రాతలా రేఖ (37) కనిపించడం లేదని సోమవారం గాంధారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు తెలిపారు. సోమ్లా నాయక్ తండాకు చెందిన రేఖకు …
Read More »