నిజామాబాద్, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాల్లో భాగంగా నాగారంలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో మహిళలకు ఆరోగ్య, న్యాయ,రక్షణ విషయాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ మహిళా న్యాయవాది కవిత రెడ్డి మాట్లాడుతూ మహిళలు తమ వ్యక్తిగత జీవితం పట్ల శ్రద్ధ వహించాలని అదేవిధంగా ఉన్నతమైన చదువులు చదవడం తమ …
Read More »Blog Layout
దళితబంధు లబ్ధిదారులు ఆదర్శంగా నిలవాలి
నిజామాబాద్, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా అభ్యున్నతి సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్దిదారులు నిర్దేశిత లక్ష్యాలకు చేరుకుని ఇతర లబ్ధిదారులకు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. యూనిట్ల స్థాపనలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని, కొంత ఆలస్యం అయినప్పటికీ పూర్తి అవగాహనతో యూనిట్లను ఏర్పాటు చేసుకుని కష్టపడితే …
Read More »కామారెడ్డి జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం
కామారెడ్డి, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వీధి వ్యాపారులకు రెండో విడత రుణాలు ఇప్పించడంలో కామారెడ్డి జిల్లా దేశంలో మొదటి స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం డిసిసి, డిఎల్ఆర్సి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. పంట రుణాలు అర్హతగల రైతులందరికీ అందించాలని సూచించారు. రుణ లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తిచేయాలని …
Read More »అనుమతి లేకుండా గృహాలు నిర్మిస్తే చర్యలు
కామారెడ్డి, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణాల్లో అనుమతి లేకుండా గృహాలు, వ్యాపార సముదాయాలు నిర్మిస్తే వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్ఫోర్స్ మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ రోడ్లను ఆక్రమించి ఎవరైనా నిర్మాణాలు చేపడితే వాటిని నిలుపుదల చేయించి తొలగించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులు …
Read More »రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతకు సన్మానం
కామారెడ్డి, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో అవార్డు పొందిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు చింతల పోశవ్వను బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సన్మానించారు. దివ్య హస్తం సొసైటీ ద్వారా చేపట్టిన వ్యాపారానికి మంచి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఐసిడిఎస్ పిడి సరస్వతి, దివ్యాంగులు పాల్గొన్నారు.
Read More »ఘనంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు
బోధన్, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ బసవతారకానగర్లోగల శ్రీ కోట మైసమ్మ సహిత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ 10వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్టు బోధన్ శివసేన అధ్యక్షులు పుసులేటి గోపికిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రథోత్సవాన్ని ముఖ్య అతిధులు ప్రారంభించారు. …
Read More »డిగ్రీ పరీక్షలలో నలుగురు డిబార్
డిచ్పల్లి, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన రెండవ …
Read More »ఏ సంబంధము లేక పోయినా ప్రతి మహిళకు రక్తదాతలు రక్త సంబంధీకులే
కామారెడ్డి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన భూలక్ష్మికి గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై నిజామాబాద్ ప్రైవేటు వైద్యశాలలో ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం నిజామాబాద్లో లభ్యం కాకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. దీంతో వారికి కావాల్సిన రక్తాన్ని పెంజర్ల సురేష్ రెడ్డి సహకారంతో మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు రాజశేఖర్ …
Read More »పయనీర్ సీడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
ఆర్మూర్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం సుబ్బిరియల్ గ్రామంలో పయనీర్ సీడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తున్నారని మగవారితో పోలిస్తే ఆడవారు ఏ రంగంలోనూ వెనుక లేరని, ఆడవారు ప్రతి ఇంటిలో ఒక తల్లిగా చెల్లెలిగా వారు సేవ చేస్తున్నారని, …
Read More »ఆక్సిజన్ కాన్సర్ట్రేటర్ అందజేత
గాంధారి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్న బాధితునికి ఆక్సిజన్ కాన్సర్ట్రేటర్ను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అందజేశారు. గాంధారి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వడ్ల సత్తయ్యకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే సురేందర్ను కలిసి పరిస్థితి వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆక్సిజన్ కాన్సర్ట్రేటర్ను ఉచితంగా తన సహచరలతో పంపించారు. ఆక్సిజన్ పరికరాన్ని …
Read More »