Blog Layout

ఇంటి వద్దకే ఆడపడుచుల కానుక

ధర్పల్లి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం మేనమామ పెండ్లి కానుకగా ప్రవేశ పెట్టిన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్‌ సంక్షేమ పథం ద్వారా అందిస్తున్న చెక్కులను మంత్రి కేటిఆర్‌ సూచన మేరకు ధర్పల్లి తహసిల్దార్‌ సహకారంతో రామడుగు గ్రామానికి మంజూరైన 95 చెక్కులను ఇంటింటికి వెళ్లి అందించడం ఆనందంగా ఉందని జడ్పిటిసి బాజిరెడ్డి జగన్‌ మోహన్‌ అన్నారు. శుక్రవారం దర్పల్లి మండలంలోని రామడుగు, …

Read More »

అభివృద్ధి పనులకు తోడ్పాటును అందించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ పథకాల కింద జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేందుకు గ్రామ, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు అధికారులకు తమవంతు తోడ్పాటును అందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. నవీపేట మండల కేంద్రంలోని లింగమయ్యగుట్ట, సుభాష్‌ నగర్‌ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులను కలెక్టర్‌ శుక్రవారం పరిశీలించారు. …

Read More »

దళితులు వ్యాపారవేత్తలుగా ఎదగాలి

కామారెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితులు రాబోయే రోజుల్లో వ్యాపారవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో దళిత బంధుపై లబ్ధిదారులకు అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు జీవితంలో స్థిరపడే వ్యాపారాలను …

Read More »

ఈ.వీ.ఎం గోడౌన్‌ పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ ప్రాంతంలో గల ఈ.వీ.ఎం గోడౌన్‌లను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే ఉంచే ఈ గిడ్డంగి భవన సముదాయంలో పలు మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో కలెక్టర్‌ ఈవీఎం గోడౌన్‌ ను సందర్శించి నిశితంగా పరిశీలన జరిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో, వీడియో రికార్డింగ్‌ మధ్యన ఈవీఎం …

Read More »

ప్రశాంతంగా కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు శుక్రవారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షల్లో …

Read More »

ధరణి టౌన్‌షిప్‌లో ప్రభుత్వమే వసతులు కల్పిస్తుంది…

కామారెడ్డి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్‌షిప్‌లో ప్రభుత్వమే మౌలిక వసతులను కల్పిస్తుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. గురువారం ధరణి టౌన్‌షిప్‌లో మండల స్థాయి అధికారులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్లు, తాగునీరు, మురుగు కాలువల నిర్మాణం పనులను ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. మార్చి 7న ప్రీ బిడ్‌ సమావేశం …

Read More »

రక్తహీనత ఉన్న మహిళలను గుర్తించాలి

కామారెడ్డి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రక్తహీనత ఉన్న మహిళలను ఆశ, అంగన్‌వాడి కార్యకర్తలు గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌లో గురువారం జరిగిన జూమ్‌ మీటింగ్‌లో వైద్యులతో జిల్లా కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. రక్తహీనత ఉన్న మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. వారికి మందులు అందే విధంగా చూడాలన్నారు. చిన్నపిల్లలు పోషకాహార లోపం …

Read More »

టీయూలో హెల్త్‌ సెంటర్‌కు డాక్టర్ల నియామక ప్రకటన

డిచ్‌పల్లి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రారంభించబోతున్న ఆరోగ్య కేంద్రం (హెల్త్‌ సెంటర్‌) లో సేవలందించడానికి ఇద్దరు డాక్టర్స్‌ నియామకం కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఒకరు మహిళా డాక్టర్‌, మరొకరు పురుష డాక్టర్‌ అవసరం ఉందని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఆసక్తి గల వైద్యులు తమ విద్యా వృత్తి అర్హతలు గల ధ్రువపత్రాలతో కూడిన దరఖాస్తుఫారంను మార్చి 10 లోపు రిజిస్ట్రార్‌, తెలంగాణ …

Read More »

క్రాస్‌ కంట్రీ చాంపియన్‌ మల్లేష్‌ను ప్రశంసించిన వీసీ

డిచ్‌పల్లి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాల విద్యార్థలకు (బాలురు – బాలికలు) ఇటీవల స్పోర్ట్స్‌ అండ్‌ గేంస్‌ డిపార్ట్‌ మెంట్‌ నుంచి క్రాస్‌ కంట్రీ చాంపియన్‌ షిప్‌ (10 కి.మీ) పరుగు పందెం నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రధాన ప్రాంగణంలోని అఫ్లైడ్‌ ఎకనామిక్స్‌ విభాగం మూడవ సంవత్సరానికి చెందిన విద్యార్థి ఎస్‌. మల్లేష్‌ …

Read More »

ఆయుష్‌ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన

నిజామాబాద్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆయుష్‌ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్‌ తన ఛాంబర్‌లో ఆయుష్‌ విభాగం వైద్యాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆయుష్‌ పరిధిలోకి వచ్చే మొత్తం 16 వైద్యశాలల్లో కనీస సౌకర్యాలు సమకూర్చేందుకు వీలుగా ఆరు లక్షల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »