కామారెడ్డి, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైందని కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ తెలిపారు. జియో, రిలయన్స్ ఫౌండేషన్, టాటా స్కై, హెచ్డీఏఫ్సీ జనరల్ ఇన్సూరెన్సుకు సంబందించి వేర్వేరుగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంస్థల ప్రతినిధులు మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువతీ, యువకులు అందివచ్చిన …
Read More »Blog Layout
యూనివర్సిటీ అక్రమాలపై విచారణ జరపాలి
నిజామాబాద్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రికి వినతి పత్రం అందించారు. అదే విధంగా యూనివర్సిటీ అక్రమాలపై ప్రత్యేక కమిటీ వేసి అర్హతలు లేని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నత విద్యా మండలి తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని అక్రమార్కుల నుండి రక్షించాలని కోరారు. అలాగే తెలంగాణ …
Read More »కెసిఆర్ అసమర్థత వల్లే రైతులకు ఇబ్బందులు…
కామారెడ్డి, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదమని నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేయాల్సింది నిరుద్యోగులు విద్యార్థులు అని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు అన్నారు. కేసీఆర్ రైతులు పండిరచిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడి రైతులు పండిరచిన ధాన్యం నాని పోవడం జరిగిందని దీనికి పూర్తి బాధ్యత …
Read More »డిసెంబర్ 1 నుండి ఉచిత గ్రూప్స్ కోచింగ్
నిజామాబాద్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ, మాజీ కలెక్టర్ చిరంజీవులు ఐ.ఏ.ఎస్, యుబియుఎన్టియు సామాజిక సేవా సంస్థను స్థాపించారు. సంస్థ ద్వారా ఉచితంగా గ్రూప్స్ కోచింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. కోచింగ్ పొందాలనుకునేవారు ఉదయం టీ, మధ్యాహ్నం బోజనం, సాయంత్రం టీ స్నాక్స్ కొరకు రోజుకు 35 రూపాయల చొప్పున విద్యార్థులు చెల్లించవలసి ఉంటుందని, 100 మంది యువకులకు, 100 మంది యువతులకు …
Read More »ఈనెల 30 వరకు రీ అడ్మిషన్ గడువు
నిజామాబాద్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పి.జిలో చేరి మధ్యలో చదువు ఆపేసిన వారు ఈనెల 30వ తేదీలోపు రీ అడ్మిషన్ తీసుకోవచ్చని ప్రాంతీయ అధ్యయన కేంద్రం రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ 1999 నుంచి 2011 సంవత్సరం మధ్యన అడ్మిషన్ తీసుకుని పూర్తిచేయనివారు, రీ అడ్మిషన్ తీసుకుని డిసెంబర్లో …
Read More »మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఏర్పాటుచేసిన మీడియా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను పురస్కరించుకొని కలెక్టరేట్లోని క్రీడా ప్రాధికారిక శాఖ కార్యాలయంలో సమాచార శాఖ ఆధ్వర్యంలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గురువారం అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రాతో కలిసి రిబ్బన్ …
Read More »జిల్లా స్థాయి ఉత్తమ యువజన సంఘ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ, నెహ్రూ యువ కేంద్ర ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్తమ యువజన సంఘ అవార్డు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన సమన్వయ కర్త, నెహ్రూ యువ కేంద్ర, శైలీ బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డు కోసం నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లోని రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న యువజన సంఘాలు 01 …
Read More »లేబర్ టర్నవుట్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు
నిజామాబాద్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లేబర్ టర్న్ ఔట్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గరాదని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్ నుండి పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నర్సరీలలో సాయిల్ కలెక్షన్ బ్యాగ్ ఫిల్లింగ్ సోమవారం వరకు పూర్తి కావాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనం వచ్చే పది …
Read More »కొత్త వైన్స్లకు బుధవారం వచ్చిన దరఖాస్తులు…
నిజామాబాద్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా యందు 102 కొత్త వైన్ షాప్లకు నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. కాగా నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ (35) ఏ 4 షాప్లకు 340 అప్లికేషన్స్, ఆర్మూరు ఎక్సైజ్ స్టేషన్ 26 ఏ 4 షాప్లకు 106 అప్లికేషన్స్, బోధన్ ఎక్సైజ్ స్టేషన్ 18 ఏ 4 షాప్లకు 71 అప్లికేషన్స్, భీంగల్ ఎక్సైజ్ …
Read More »రూ. 6.45 కోట్లతో ధాన్యం నిలువ గోదాముల నిర్మాణం
కామారెడ్డి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జుక్కల్లో రూర్బన్ పథకం కింద 6.45 కోట్ల రూపాయలతో పది ధాన్యం నిల్వ గోదాములను నిర్మించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పది గోదాములలో 8150 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చని తెలిపారు. 14 వేల 296 …
Read More »