Blog Layout

కామారెడ్డి లయన్స్‌ క్లబ్‌ సేవల్లో కలికితురాయి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో కామారెడ్డి లైన్స్‌ క్లబ్‌కు ప్రత్యేక స్థానం ఉందని, కామారెడ్డి లైన్స్‌ క్లబ్‌ తెలంగాణకు కలికితురాయి అని జిల్లా కోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజల బిక్షపతి పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్టుల బార్‌ అసోసియేషన్‌లో లైన్స్‌ క్లబ్‌ కామారెడ్డి సంయుక్తంగా డయాబెటిక్‌ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్బంగా న్యాయవాదులు, జుడిషియల్‌ సిబ్బందికి షుగర్‌ టెస్ట్‌లు నిర్వహించారు. 90 …

Read More »

ఫ్రెండ్స్‌ యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలో ఫ్రెండ్స్‌ యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద చిన్నారులకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా డిసిసిబి వైస్‌ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి హాజరై విజేతలైన చిన్నారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్‌ యూత్‌ క్లబ్‌ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు.

Read More »

సబ్సిడీ వ్యాపార పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పూర్తి సబ్సిడితో ఇచ్చే చిన్న తరహా వ్యాపార పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఎస్సీ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయము హైదరాబాద్‌ ప్రత్యేకాధికారి బి.ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. శనివారం రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్న తరహా వ్యాపార పథకాల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. …

Read More »

27 నుండి కొత్త ఓటర్ల నమోదు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకునే ప్రతి ఒక్కరూ జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ శశాంక్‌ గోయల్‌ జిల్లాల కలెక్టర్లను, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వచ్చే సంవత్సరం జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు …

Read More »

నిమజ్జనం సందర్భంగా వాహ‌నాల‌ దారిమళ్ళింపు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలందరు ఆనందంగా శోభయాత్రలో పాల్గొనడానికి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఏలాంటి రూమర్స్‌ (పుకార్ల) ను నమ్మరాదని, అవసరం అనుకుంటే దగ్గరలోని సిబ్బందికి గాని పోలీస్‌ స్టేషన్‌కు గాని సమాచారం అందించాలన్నారు. సామాజిక మాధ్యమంల్లో వచ్చే వదంతులు నమ్మవద్దని, శోభయాత్ర జరిగే ప్రాంతాలలో యాత్ర జరిగేటప్పుడు …

Read More »

వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జిల్లా అంతటా వినాయక నిమజ్జనానికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. శనివారం సిపి కార్తికేయ, అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రా మిశ్రాతో కలిసి బాసర గోదావరి బ్రిడ్జిపై గణేష్‌ నిమజ్జనానికి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 19వ …

Read More »

వరద కాలువకు నీటి విడుదల

ముప్కాల్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర మంత్రివర్యులు, బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11 గంటలకు వరద కాలువ ద్వారా నీటి విడుదల చేశారు. ముప్కాల్‌ ఎంపిపి సామ పద్మా వెంకట్‌ రెడ్డి ఈ సందర్బంగా ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టు నుంచి వరద కాలువకు 2 వేల క్యూసెక్కుల నీటిని బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ప్రాజెక్టు …

Read More »

నిమజ్జన పనులు పరిశీలించిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో ఆదివారం రాత్రి జరిగే గణేశ నిమజ్జన కార్యక్రమం కోసం టేక్రియల్‌ చెరువు వద్ద జరుగుతున్న పనులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పరిశీలించారు. ఆయన వెంట మునిసిపల్‌, పోలీస్‌, రెవిన్యూ, నీటి పారుధల శాఖ అధికారులతో పాటు డిఎస్‌పి, ఛైర్మెన్‌, వైస్‌ చైర్మన్‌ తదితరులు ఉన్నారు.

Read More »

గణేష్‌ నిమజ్జనానికి సర్వం సిద్ధం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేష్‌ నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరగాలని ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వినీత పవన్‌ అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని పెర్కిట్‌, మామిడిపల్లి, గుండ్ల చెరువులను అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే గణేష్‌ నిమజ్జనానికి తరలివెళ్లే శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించి రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చివేయించినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా నిమజ్జనం జరిగే చెరువులు, బావుల వద్ద బారికేడ్లు ఏర్పాటు …

Read More »

సమానపనికి సమానవేతనం కావాలి

బోధన్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ దేశ కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి, త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలు, హక్కులను రద్దు చేసి, కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా 4 కోడ్‌లను తెచ్చారని వీటి రద్దుకై ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో 20 తేదీన లేబర్‌ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపు నిచ్చారని, శనివారం బోధన్‌ పట్టణంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »