Breaking News

Tag Archives: armoor

క్రీడల్లో సత్తాచాటిన ఆర్మూర్‌ విద్యార్థినిలు

ఆర్మూర్‌, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళాశాల ఆర్మూర్‌ విద్యార్థినిలు క్రీడల్లో తమ సత్తా చాటి గెలుపొందారు. ఈనెల 11, 12 వ తేదీలలో తెలంగాణ యూనివర్సిటీ నిర్వహించిన ఇంటర్‌ కాలేజ్‌ టోర్నమెంట్లో ఆర్మూర్‌ విద్యార్థినులు ఎం .అంజలి అథ్లెటిక్స్‌ 800 మీటర్లు మరియు లాంగ్‌ జంప్‌లో ద్వితీయ స్థానంలో గెలుపొందారు. వాలీబాల్‌ లో నిహారిక టీం …

Read More »

11న బేస్‌బాల్‌ జట్టు ఎంపిక

నిజామాబాద్‌, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11న ఆర్మూర్‌ జడ్‌పిహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో బేస్‌ బాల్‌ జిల్లా సీనియర్‌ పురుషుల జట్టు ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా బేస్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎల్‌ మధుసూదన్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్‌ తెలిపారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు మధ్యాహ్నం 3 గంటలకు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మల్లేష్‌ గౌడ్‌కి, అకాడమీ కోచ్‌ నరేష్‌కి …

Read More »

మానవ జీవన వికాసానికి చరిత్ర పుస్తకాలె ఆధారాలు

ఆర్మూర్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవ జీవన వికాసానికి చరిత్ర పుస్తకాలె ఆధారాలని రాష్ట్ర బి.సీ డెడికేటెడ్‌ చైర్మన్‌ రిటైర్డ్‌ ఐ.ఏ.ఏస్‌ అధికారి బుసని వెంకటేశ్వర రావు అన్నారు. గురువారం నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో బి.సీ కులాల రాజకీయ స్థిగతులపై కుల సంఘాల వారి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా బాల్కొండ శ్రీ సోమ క్షత్రియ ‘‘నకాష్‌’’ బాల్కొండకు చెందిన బి.ఆర్‌.నర్సింగ్‌ రావు …

Read More »

రాష్ట్ర స్థాయి బేస్‌బాల్‌ పోటీలకు విద్యార్థుల ఎంపిక

ఆర్మూర్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 4న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సుద్ధపల్లి క్రీడామైదానంలో జరిగిన జిల్లా సీనియర్‌ బేస్‌ బాల్‌ ఎంపిక పోటీలలో షెడ్యూల్‌ కులాల అభివృద్ధి ఆర్మూర్‌ శాఖ హాస్టల్‌ విద్యార్థులు ఈ ప్రవళిక, జి జలజ లు పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచారు. ఈనెల 07 నుండి 09 వరకు జగిత్యాల జిల్లాలో జరిగే రాష్ట్ర బేస్బాల్‌ పోటీలకు …

Read More »

దేశ సమైక్యత, సమగ్రతను పెంపొందించేందుకే ఫోటో ఎగ్జిబిషన్‌

ఆర్మూర్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ‘‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌’’ పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడీ రాకేష్‌ రెడ్డి సోమవారం రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌, ఫీల్డ్‌ ఆఫీస్‌ నిజామాబాద్‌ ఈ ప్రదర్శనను …

Read More »

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని పిప్రీ గ్రామంలో పిప్రీ ఆరోగ్య ఉప కేంద్రాల ఆధ్వర్యంలో శనివారం జ్వర సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ గంగ దినేష్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు …

Read More »

డిగ్రీ కళాశాలలో వ్యాసరచన, రంగోలి పోటీలు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఈ నెల 28 నుంచి 29వ తేదీ వరకు ‘‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌’’ పై రెండు రోజుల పాటు ఛాయాచిత్ర పదర్శన ఏర్పాట్లు చేసినట్లు సీబీసీ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ …

Read More »

25న పెర్కిట్‌లో రక్తదాన శిబిరం

ఆర్మూర్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 25వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి పెర్కిట్‌ లోని ఎం.ఆర్‌. గార్డెన్స్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు ఆర్మూర్‌ ఇన్స్‌ పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కావున రక్తదాన శిబిరానికి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేయాలని పేర్కొన్నారు.

Read More »

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన పివిఆర్‌ ..

ఆర్మూర్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ బాధ్యులు పొద్దుటూర్‌ వినయ్‌ కుమార్‌ రెడ్డి సోమవారం మండలంలోని చేపూర్‌ గ్రామంలో ఇటీవల మరణించిన చేపూర్‌ మాజీ ఎంపిటిసి జన్నెపల్లి గంగాధర్‌ సోదరుడు పెద్ద రాజన్న, నూత్‌పల్లి రవి, కొనింటి వెంకటేష్‌, సారంగి మురళి, దుబ్బాక సుధాకర్‌, సూర్యునిడ రాజేశ్వర్‌ల కుటుంబ సభ్యులను ఆర్మూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సురకంటీ చిన్నారెడ్డితో …

Read More »

శ్రీ సరస్వతీ విద్యా మందిర్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని శ్రీ సరస్వతీ విద్యా మందిరు పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. పాఠశాల ఆవరణలో విద్యార్థినిలు రంగురంగుల దుస్తులు ధరించి బతుకమ్మ, డీజే పాటలకు నృత్యాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిభంభించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్‌ వినోద్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »