Tag Archives: banswada

ఇది కాంగ్రెస్‌ పార్టీలోనే సాధ్యం…

బాన్సువాడ, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధీభవన్‌లో మంగళవారం బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం పీసీసీ డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. డాక్టర్‌ రాజారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థుల కొరకు ఈ నూతన దరఖాస్తు పద్ధతి చాలా బాగుందని దీనికి ఉత్సాహవంతులైన నిజమైన కార్యకర్తలకు అవకాశం కలిగినట్టు ఉన్నదన్నారు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఇది కాంగ్రెస్‌ పార్టీలోనే సాధ్యమని …

Read More »

సూపర్‌ లగ్జరీ బస్సులను ప్రారంభించిన స్పీకర్‌

బాన్సువాడ, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఆర్టీసీ డిపోలో నూతనంగా వచ్చిన రెండు సూపర్‌ లగ్జరీ బస్సులను సోమవారం సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన ప్రజా రవాణా కల్పించేందుకు సూపర్‌ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తేవడం జరిగిందని ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించాలన్నారు. అనంతరం డిపో నుండి ప్రధాన మెయిన్‌ రోడ్డుకు …

Read More »

ఘనంగా రాజీవ్‌ గాంధీ జయంతి వేడుకలు…

బాన్సువాడ, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని రాజీవ్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజ్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ కాసుల బాలరాజ్‌ మాట్లాడుతూ రాజీవ్‌ గాంధీ దేశంలో తీసుకొచ్చిన సంస్కరణ వల్ల నేటి యువత విదేశాల్లో రాణిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి …

Read More »

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

బాన్సువాడ, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని జక్కల్‌ దాని తండా గ్రామానికి చెందిన భాస్కర్‌ ఈ నెల 16 తేదీన ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారికి, బంధువుల వద్ద వెతికిన ఆయన జాడ తెలియలేదు. శనివారం బోర్లమ్‌ గ్రామ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి శవం ఉందని తెలిసి జక్కల దాని తాండ గ్రామానికి చెందిన భాస్కర్‌ …

Read More »

బిసి బంధు.. బడుగు వర్గాల్లో వెలుగు

బాన్సువాడ, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ మున్సిపాలిటీ, బాన్సువాడ గ్రామీణ, బీర్కూరు, నస్రుల్లాబాద్‌ మండలాల పరిధిలో మంజూరైన లక్ష రూపాయల బిసి బంధు చెక్కులను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు డి. …

Read More »

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

బాన్సువాడ, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్‌ గ్రామానికి చెందిన పసుపుల పసుపుల రాజు చెట్టుకు ఉరేసుకొని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పసుపుల రాజు మద్యానికి బానిసై భార్యను విపరీతంగా వేధింపులకు గురి చేయడంతో ఆమె భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినప్పటికీ పసుపుల రాజు మద్యానికి బానిసై ఈనెల 6న మద్యం తాగడానికి డబ్బులు కావాలని కుటుంబ సభ్యులను బెదిరించారు. …

Read More »

పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్‌

బాన్సువాడ, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని కోనాపూర్‌ గ్రామాన్ని శనివారం జిల్లా అదనపు కలెక్టర్‌ మను చౌదరి సందర్శించారు. ఈ సందర్భంగా మొదటిసారి గ్రామానికి విచ్చేసిన జిల్లా అదనపు కలెక్టర్‌ కు గ్రామ సర్పంచ్‌ వెంకటరమణారావు దేశ్ముఖ్‌ స్వాగతం పలికి శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ గ్రామంలోని పల్లె ప్రగతి కింద అభివృద్ధి అయిన పనులను పరిశీలించి ఆయన …

Read More »

సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనాన్ని అందించాలి

బాన్సువాడ, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ సమగ్ర శిశు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతన స్కేల్‌ అందించాలని కోరుతూ శుక్రవారం ఆర్డీవో, తహాసిల్దార్లకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి చాలీ చాలని వేతనాలతో కుటుంబాలను వెల్లదిస్తున్నామని, ప్రభుత్వం విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస …

Read More »

మిషన్‌ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

బాన్సువాడ, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం బాన్సువాడ పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీగా మెగా ఏజెన్సీ కార్యలయంలో సంబంధిత అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ మిషన్‌ భగీరథ కింద విధులు నిర్వహిస్తున్న కార్మికులు చాలీ చాలని వేతనాలతో కుటుంబాన్ని పోషిస్తున్నారని, కార్మికులకు రావలసిన హక్కులను కాపాడాలని …

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన కాసుల రోహిత్‌

బాన్సువాడ, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన గుత్తి మల్లు కొండకు చెందిన నివాసపు ఇల్లు ఇటీవల భారీ వర్షాలకు కూలిపోవడంతో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ యువజన నాయకుడు కాసుల రోహిత్‌ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం వారిని పరామర్శించిన పాపాన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »