నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధేయ మార్గం అందరికి ఆదర్శం,అనుసరణీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ దండు నీతూకిరణ్ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని సోమవారం నిజామాబాద్ నగరంలోని గాంధీచౌక్లో గల మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. …
Read More »పరస్పర సహకారంతో ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరస్పర సహకారంతో ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ హితవు పలికారు. ఈ నెల 28న వినాయక నిమజ్జన శోభాయాత్ర, మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఒకే రోజున నిర్వహించనున్న నేపథ్యంలో, మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. వేడుకల నిర్వహణ తీరుతెన్నుల గురించి ఇరు …
Read More »ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణతో కలిసి కలెక్టర్ మంగళవారం వినాయక శోభాయాత్ర కొనసాగే మార్గాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా, భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే మార్గమైన …
Read More »ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ప్రభుత్వ పరంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం …
Read More »మట్టి గణపతులను పూజిద్దాం … పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్టించి, వినాయక చతుర్థి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం సుభాష్ నగర్ లోని జిల్లా పరిషత్ కూడలి వద్ద మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజలకు చెరువు మట్టితో …
Read More »విద్యార్థినులను పరామర్శించిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అస్వస్థతకు గురై నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీంగల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరామర్శించారు. మంగళవారం ఉదయం ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వాకబు చేశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని, బాలికలందరు పూర్తి స్థాయిలో కోలుకునేంత వరకు …
Read More »ప్రజావాణికి 81 ఫిర్యాదులు
నిజామాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 81 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ పి. యాదిరెడ్డి, డీఆర్డీఓ చందర్, …
Read More »ఆర్ అండ్ బీ అతిథి గృహాన్ని పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని రోడ్లు – భవనాల శాఖ అతిథి గృహాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. అతిథి గృహంలో నెలకొని ఉన్న వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. త్వరలో జరుగనున్న ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ అబ్జర్వర్లు, ఇతర ఉన్నతాధికారులు ఎన్నికల పరిశీలన నిమిత్తం హాజరయ్యే అవకాశాలు ఉన్నందున అతిథి గృహంలో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉండేలా …
Read More »రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు
నిజామాబాద్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా జిల్లా కమిటీ సమావేశం జరిగింది. పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, జాతీయ రహదారుల సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ, రెడ్ క్రాస్ …
Read More »విలువైన విద్య, విజ్ఞానం అందించి సమసమాజ స్థాపనకు దోహదపడాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, విజ్ఞానాన్ని అందించి సమసమాజ స్థాపనకు దోహదపడాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనందున అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ గురువు స్థానానికి ఉన్న గౌరవాన్ని మరింతగా ఇనుమడిరపజేయాలని హితవు పలికారు. …
Read More »