నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నియోజకవర్గస్థాయిలో తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఆర్మూర్ శాసనసభ్యులు ఆశన్న గారి జీవన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ వినీత పండిత్ …
Read More »గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. ఆదర్శ హిందీ విద్యాలయ (హరిచరణ్ మార్వాడి) కళాశాలతో పాటు పద్మనగర్ లోని విశ్వశాంతి జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల …
Read More »సాహితీ సౌరభాలను గుభాళించిన దశాబ్ది వేడుక
నిజామాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సాహిత్య దినోత్సవం అట్టహాసంగా జరిగింది. కవులు, కవయిత్రులు, సాహితీవేత్తలు ఉత్సాహంగా తరలివచ్చి తమ పద్య, వచన కవిత్వాలతో తెలంగాణ ఔన్నత్యాన్ని ఆవిష్కరింపజేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్ సాహిత్య సౌరభాల గుభాళింపులకు వేదిక అయ్యింది. ముందుగా ఖిల్లా జైలులోని ప్రముఖ …
Read More »సుపరిపాలనలో అందరికీ ఆదర్శం తెలంగాణ
నిజామాబాద్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ ప్రగతి పథంలో అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం అందరికీ ఆదర్శంగా మారిందని వక్తలు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం నిజామాబాద్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ అధ్యక్షతన తెలంగాణ సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, …
Read More »దశాబ్ది సంబురానికి వేదికలైన చెరువు గట్లు
నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు చెరువు గట్లు వేదికలయ్యాయి. మండుటెండల్లోనూ జలకళతో తొణికిసలాడుతున్న చెరువుల వద్దకు ఊరూరా ప్రజలు తరలివచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనాలు, బతుకమ్మలు, బాణాసంచా పేలుళ్లు, వలల ప్రదర్శనలతో ఎటు చూసినా వెల్లివిరిసిన ఉత్సాహంతో పండుగ వాతావరణం కనిపించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ …
Read More »పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ
నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరిశ్రమలు నెలకొల్పే వారికి అనుకూలంగా ఉండేలా ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా సరళీకృత విధానాలను అమలు చేస్తుండడంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి గణనీయంగా వృద్ధి చెందుతోందని, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్ సమీకృత …
Read More »వెలుగులీనిన ‘విద్యుత్ విజయోత్సవ’ సభలు
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి సభలు వెలుగుల సౌరభాలను వెదజల్లాయి. 2014 కు పూర్వం నెలకొని ఉన్న కారు చీకట్లను చీల్చుకుని, నేడు వాడవాడలా నిరంతర కాంతి రేఖలతో దేదీప్యమానంగా వెలుగులీనుతున్న ఉజ్వల తెలంగాణను ఆవిష్కరింపజేశాయి. రాష్ట్ర ప్రగతిలో అత్యంత కీలకమైన విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం …
Read More »తెలంగాణ పోలీస్ నెంబర్ వన్
నిజామాబాద్, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సురక్షా దినోత్సవం నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా …
Read More »ముందస్తుగా పంటలు విత్తుకోవడం ఎంతో శ్రేయస్కరం
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రకృతి వైపరీత్యాల బారి నుండి పంట నష్టాలను నివారించుకునేందుకు ముందస్తుగానే పంటలు విత్తుకోవడం ఎంతో శ్రేయస్కరం అని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా రైతాంగానికి హితవు పలికారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల ప్రభావం నుండి పంటలను కాపాడుకోవాలంటే ముందస్తు పంటలకు వెళ్లడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. మోస్రా మండల కేంద్రంతో పాటు వర్ని మండలం …
Read More »తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, కలెక్టర్
నిజామాబాద్, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు – భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలుపెరుగని పోరాటాలు, అనేక త్యాగాల ఫలితంగా ఆరు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానంతో సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాల …
Read More »