నిజామాబాద్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న లిప్రజావాణిలి కార్యక్రమాన్ని తాత్కాలికంగా లివాయిదాలి వేయడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24న సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్ బృందం జిల్లా పర్యటనకు విచ్చేస్తోందని, సమీకృత జిల్లా కార్యాలయాల …
Read More »రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా పని చేయాలి
నిజామాబాద్, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా వివిధ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు సూచించారు. బుధవారం జెడ్పి చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎజెండాలోని వివిధ అంశాలపై …
Read More »ప్రజావాణికి 73 ఫిర్యాదులు
నిజామాబాద్, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 73 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్లకు విన్నవిస్తూ …
Read More »అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని భావి తరాలకు అందించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని భావితరాలకు అందించాలని వక్తలు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగబద్దంగా హక్కులు కల్పించిన గొప్ప మేధావి అంబేడ్కర్ అని కొనియాడారు. జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం లో అంబేడ్కర్ 132వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. …
Read More »ఓటరు జాబితాలో పేరు తొలగించారనే ఫిర్యాదులు రాకూడదు
నిజామాబాద్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితాలో తమ పేరును తొలగించారంటూ అర్హులైన ఏ ఒక్క ఓటరు నుండి కూడా ఫిర్యాదులు రాకుండా జాబితా పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. బుధవారం ఆయన ఎన్నికల జాబితా, బూత్ లెవెల్ అధికారుల నియామకం, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో …
Read More »నిర్దిష్ట ప్రణాళికతో సాఫీగా ధాన్యం సేకరణ ప్రక్రియ
నిజామాబాద్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకు గాను సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, ఐకెపి సీసీలు, రైస్ మిల్లర్లతో …
Read More »అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు
నిజామాబాద్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నెల 14 వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జిల్లా నుండి నియోజకవర్గాల వారీగా ప్రజలను తరలించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సంబంధిత శాఖల …
Read More »ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు
నిజామాబాద్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మా జ్యోతిబా పూలే 197వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేడ్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా అధ్యక్షత వహించగా, జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ దండు నీతూకిరణ్, …
Read More »భవన నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని ధర్మపురిహిల్స్ వద్ద చేపడుతున్న ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణ పనులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం పరిశీలించారు. నిజామాబాద్ నగరంలో ఏడు మైనారిటీ పాఠశాలలు కొనసాగుతుండగా, వాటిలో బాలికల కోసం ఒకే చోట ధర్మపురిహిల్స్ వద్ద నాలుగు స్కూళ్లకు పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. వాటిలో ఇప్పటికే ఒకదాని నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. …
Read More »అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలో ప్రజలను భాగస్వాములు చేయాలి
నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నెల 14 వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుక కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భాగస్వాములు చేయాలని సంకల్పించడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి అన్నారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఆమె అంబేద్కర్ విగ్రహావిష్కరణ, …
Read More »