నిజామాబాద్, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర …
Read More »ఈవీఎం గోడౌన్ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా ఈవీఎం గోడౌన్ ను పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ ను తెరిపించి, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన …
Read More »ధరణి ధరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం తగదు
నిజామాబాద్, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వానికి తావులేకుండా యుద్దప్రాతిపదికన పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ గురువారం సందర్శించి, ధరణి దరఖాస్తుల పరిశీలన, వాటి పరిష్కారం తీరుపై స్థానిక రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపారు. ఆర్మూర్ మండలం పరిధిలో ఆయా మాడ్యూల్స్ లో పెండిరగ్ లో ఉన్న …
Read More »ధరణి పెండిరగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత
నిజామాబాద్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి పెండిరగ్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు పెండిరగ్ లో ఉండకుండా వెంటదివెంట పరిష్కరించేందుకు చొరవ చూపాలని అన్నారు. డిచ్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు, ఆపరేటర్లను వివరాలు …
Read More »పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర భూ పరిపాలనా విభాగం ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ధరణి పెండిరగ్ దరఖాస్తులు, ప్రజావాణిలో భూ సంబంధిత అంశాలపై దరఖాస్తుదారులు సమర్పించిన అర్జీలపై చేపట్టిన చర్యలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, …
Read More »విద్యా, వైద్య రంగాలకు సముచిత ప్రాధాన్యత
నిజామాబాద్, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని బోధన్ నియోజకవర్గ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధనను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను పురస్కరించుకుని బుధవారం బోధన్ పట్టణం రాకాసిపేట్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో …
Read More »గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాణిక్ బండార్ సమీపంలో గల కాకతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలతో పాటు, ఎస్.ఆర్ కాలేజీలో కొనసాగుతున్న గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. …
Read More »వచ్చే సోమవారం నుండి యధావిధిగా ప్రజావాణి
నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంటు ఎలక్షన్స్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని …
Read More »అబ్జర్వర్ల సమక్షంలో కౌంటింగ్ సిబ్బంది సెకండ్ ర్యాండమైజేషన్
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ సిబ్బంది సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం పూర్తి చేశారు. ఎన్నికల పరిశీలకులు ఎలిస్ వజ్ ఆర్, లలిత్ కుమార్ల సమక్షంలో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసీ హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి …
Read More »తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలి
నిజామాబాద్, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం …
Read More »