నిజామాబాద్, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గంజాయి, క్లోరోఫామ్, అల్ఫ్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. మత్తు పదార్థాల రవాణాపై నిరంతరం నిఘాను కొనసాగించాలని, ఎలాంటి సమాచారం తెలిసినా పరస్పరం పంచుకుంటూ వీటి నిరోధానికి పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్లాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. …
Read More »గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్
నిజామాబాద్, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 5వ తేదీన నందిపేట పోలీస్ స్టేషన్లో నందిపేట్ మండలం అన్నారం గ్రామానికి చెందిన పొగరు రవి కిరణ్ ఇచ్చిన దరఖాస్తు మేరకు, నిజామాబాద్ సిపి, పి. సాయి చైతన్య ఆదేశాల అనుసారం, నందిపేట్ పోలీసు స్టేషన్లో చీటింగ్, ఇమిగ్రేషన్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దోందిగల భూమేష్, పబ్బ భూమేష్ రెడ్డి, అతని భార్య …
Read More »భీంగల్ పోలీస్ స్టేషన్ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
భీంగల్, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య భీంగల్ పోలీస్ స్టేషన్ను గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ మొత్తం కలియ తిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసిప్షన్ సెంటర్ పనితీరును, కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. 5ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకొని మొత్తం చూసారు. …
Read More »ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందిరమ్మ ప్రజా పాలనతో కూడిన తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలు అందేలా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు హితవు పలికారు. సన్న బియ్యం పంపిణీ,తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యతనిస్తూ సమస్యలు తలెత్తితే సత్వరమే పరిష్కరించాలని …
Read More »పోలీసు శాఖ ఆద్వర్యంలో విద్యార్థినిలకు సమ్మర్ క్యాంప్
నిజామాబాద్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా విద్యార్థుల కోసం ఉచిత సమ్మర్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్టు పోలీసు కమిషనర్ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 25వ తేదీ నుంచి మే 2వ తేదీవరకు, ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆర్మూర్ రోడ్డులోగల ఆర్.బి.వి.ఆర్.ఆర్. …
Read More »