కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఫాక్సో కోర్టు భవనంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. న్యాయవాదులు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీదేవికి కళ్లద్దాలను కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా …
Read More »లోక్ అదాలత్ ద్వారా శాశ్వత పరిష్కారం
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లోక్ అదాలత్ ద్వారా ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కామారెడ్డి జిల్లా జడ్జి శ్రీదేవి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కోర్టులో బుధవారం జాతీయ లోక్ అదాలత్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సంవత్సరాల తరబడి వివాదంలో ఉన్న రెవెన్యూ , కుటుంబ సమస్యలకు లోక్ అదాలత్ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. …
Read More »ఓటు వజ్రాయుధం
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటు వజ్రాయుధం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఓటు చాలా పవిత్రమైందని తెలిపారు. దానిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నిజాయితీగల అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు. 18 …
Read More »కామరెడ్డిని పొగాకు రహిత జిల్లాగా మార్చాలి
కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాను పొగాకు రహిత జిల్లాగా మార్చాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం పొగాకు నియంత్రణ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం, సామర్థ్యం పెంపు పొగాకు రహిత కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పొగాకు తాగకుండా ప్రతి ఒక్కరు …
Read More »బందుకు సహకరించిన వ్యాపారస్తులకు ధన్యవాదాలు
బాన్సువాడ, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 16న బాన్సువాడ పట్టణంలో హిందూ సంఘాల కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేయడంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో మంగళవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో బాన్సువాడ బందుకు పిలుపునివ్వడంతో వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. కాగా బందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి బిజెపి నియోజకవర్గ నాయకులు మల్యాద్రి …
Read More »కన్యకాపరమేశ్వరి ఆలయానికి రూ. 1.50 లక్షల విరాళం
కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ముఖద్వారానికి ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా 1 లక్ష 50 వేల రూపాయలను మంగళవారం హైదరాబాదులోని తన నివాసంలో ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ గుప్తా, వాసవి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మాది మాజీ అధ్యక్షుడు …
Read More »నాటుసారా తయారుచేసినా, విక్రయించినా కఠిన చర్యలు
కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కల్తీకల్లు, నాటు సారా తయారు చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఎస్ రవీందర్ రాజు తెలిపారు. 2022 జూలై 1 నుంచి కామారెడ్డి జిల్లాలోని ఐదు ఎక్సైజ్ స్టేషన్లో పరిధిలో నమోదైన కేసుల వివరాలను సోమవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కల్లు 167 షాంపిళ్లను సేకరించి రసాయనశాలకు పంపించి కేసులు …
Read More »ప్రయివేటు వాహనాలు నిలుపకుండా తనిఖీలు చేపట్టాలి
కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బస్టాండ్ సమీపంలో ప్రైవేటు వాహనాలు నిలుపకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఆర్టీసీ, ఆర్టీవో, పోలీస్ అధికారులతో ఆర్టీసీ ఆదాయం పెంపుపై సమీక్ష నిర్వహించారు. ప్రతి సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 …
Read More »ఉత్తమ అధికారుల వివరాలు అందజేయాలి
కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :ఉత్తమ అధికారులను ఎంపిక చేసి శాఖల వారీగా వారి పేర్లను పర్యవేక్షకుడు సాయి భుజంగరావుకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజా ప్రతినిధులకు ఆహ్వాన పత్రికలు అందే విధంగా అధికారులు చూడాలని …
Read More »పకడ్బందీ ఏర్పాట్లు చేసిన కలెక్టర్లకు అభినందనలు
కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు శిబిరాలను ప్రతిరోజు పర్యవేక్షించి శిబిరాలలో సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతి, సంబంధిత ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు నిర్వహణ పై …
Read More »