కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీటి ఠాకూర్ రక్త నిధి కేంద్రంలో శనివారం పట్టణ కేంద్రానికి చెందిన సంతోష్ కుమార్ రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని ప్రస్తుత తరుణంలో రక్తనిధి కేంద్రాలలో రక్త నిల్వలు లేకపోవడంతో గర్భిణీ స్త్రీలు, వివిధ …
Read More »కామారెడ్డిలో ఆచార్య జయశంకర్ జయంతి
కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలను ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని ప్రొఫెసర్ జయశంకర్ రగిలించారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శనివారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. స్వయం పాలనలోని తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని …
Read More »ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాల
కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. లాటరీ వచ్చిందని, జీఎస్టీ చెల్లించాలని మాయ మాటలు చెప్పి ఆన్లైన్లో మోసగాళ్లు నగదు దోచుకుంటున్నారని చెప్పారు. మాయమాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. డయల్ 1930 …
Read More »డిజిటల్ సేవలను వినియోగించాలి
కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిజిటల్ సేవలను వినియోగించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో బ్యాంకింగ్ ప్రణాళికలపై అవగాహన సమావేశం నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు జిల్లాలోని అన్ని బ్యాంకుల ఖాతాదారులకు డెబిట్, క్రెడిట్ కార్డులు ,మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలగు సౌకర్యాలను అందించాలని సూచించారు. ఖాతాదారులు …
Read More »యువత రక్తదానానికి ముందుకు రావాలి
కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కళాభారతిలో పోటి పరీక్షలకు శిక్షణ పొందుతున్న విద్యార్థులతో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. రక్తదానం చేసిన పోటీ పరీక్షల అభ్యర్థులను అభినందించారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న …
Read More »పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేయాలి
కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 7న జరిగే ఎస్ఐ పరీక్షకు ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం అధికారులతో ఎస్సై పరీక్ష పై సమీక్ష నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి వేయించాలని సూచించారు. అభ్యర్థులు ఉదయం తొమ్మిది …
Read More »చేనేత వస్త్రాలను వినియోగించాలి
కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చేనేత వస్త్రాలను ప్రజలు వినియోగించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా స్టాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చేనేత వారసత్వ సంపదను కాపాడాలని కోరారు. చేనేత వస్త్రాలను విరివిగా వాడుకోవాలని సూచించారు. చర్మానికి రక్షణగా ఉంటాయన్నారు. హుందాతనంను పెంచుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 29 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 22 లక్షల 61 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,482 మందికి 9 కోట్ల 25 లక్షల 61 వేల 300 …
Read More »స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి రగిలేలా వజ్రోత్సవాలు
కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశభక్తి, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో రగిలేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు సహా జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొనేలా చూడాలన్నారు. గురువారం భారతస్వాతంత్ర వజ్రోత్సవాల నిర్వహణపై కలెక్టరేట్ నుండి అన్ని …
Read More »ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలి
కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను అదేశించారు. గురువారం ఐడివోసిలోని జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయంలో కొత్తగా నియామకమైన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో డిపిఆర్వో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు నిర్దేశిత …
Read More »