కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకి వస్తున్న అనూహ్య స్పందన చూసి ఓర్వలేక దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఖమ్మం బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, రామాయంపేట తల్లి కొడుకుల ఆత్మ హత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ …
Read More »అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అగ్నిమాపక శాఖ అధికారులు వరదలు, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు సేవ చేయడానికి ముందుంటారని …
Read More »కామారెడ్డిలో మెగా హెల్త్ క్యాంపు
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మెగా హెల్త్ క్యాంప్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్, ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని ఆరోగ్య కేంద్రాల ప్రజలు ఈ …
Read More »ఆపరేషన్ నిమిత్తం ఏబి నెగిటివ్ రక్తదానం
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ విష్ణు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై పూజిత (21)కు ఏబి నెగెటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం నిజామాబాద్ రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వెంటనే గిద్ద గ్రామానికి చెందిన రక్తదాత సంతోష్ సహకారంతో …
Read More »కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి…
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చేలా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ, సహకార, పౌర సరఫరా, రవాణా, ఐకెపి, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ప్రతి రైతు ధాన్యంను ప్యాడి …
Read More »వేసవిలో పశుపోషణలో తీసుకోవలసిన జాగ్రత్తలు
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవిలో పశుపోషణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సంరక్షించుకోవడానికి పాటించవలసిన సూచనల వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఆవిష్కరించారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈ సందర్భంగా మాట్లాడారు. గేదెలు, గొర్రెలు, మేకల, కోళ్ల పెంపకం పోషణలో వేసవిలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మేతకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు …
Read More »ప్రజావాణి సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదుల ను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు. …
Read More »ఉద్యోగుల సమస్యలపై మంత్రికి వినతి
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం కలిసి మొక్కను అందజేశారు. హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళ్తుండగా మార్గమధ్యంలో టేక్రియాల్ శివారులోని ఓ హోటల్ వద్ద కొద్దిసేపు ఆగారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారిణి రజిత, …
Read More »మానవత్వానికి మించిన మతం లేదు
కామారెడ్డి, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా నర్సింగ్కు చెందిన రేణుక (21) గర్భిణీకి అత్యవసరంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాల మెదక్ ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం లభించకపోవడంతో రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. దీంతో భిక్కనూరు మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ బద్దం నిశాంత్ రెడ్డికి తెలియజేయగా వెంటనే రాత్రి వేళ అయినా …
Read More »నాడు అద్దె వాహనాలు… నేడు వాహన యజమానులు
కామారెడ్డి, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొన్నటి వరకు అద్దె వాహనాలు నడిపిన వ్యక్తులు దళిత బంధు పథకంతో వాహనాలు పొంది యజమానులుగా మారారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గురువారం దళిత బందు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. దళితుల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో దళిత బంధు …
Read More »