హైదరాబాద్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో హైదరాబాద్, ప్రజాభవన్ లో త్వరలో ‘గల్ఫ్ అమరుల సంస్మరణ సభ’ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులతో సీఎం ఏ. రేవంత్ రెడ్డి సహపంక్తి భోజన కార్యక్రమంలో …
Read More »యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం
నిజామాబాద్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 03వ తేదీ నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండలి ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం …
Read More »మసీదుల వద్ద సౌకర్యాలు కల్పించాలి…
కామారెడ్డి, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంజాన్ మాసంలో మసీదుల వద్ద అని సౌకర్యాలు కల్పించాలని కామారెడ్డి బిజెపి పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు నేహల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ నేహాల్ మాట్లాడారు. ఈనెల ఫిబ్రవరి 2 తేది ఆదివారం నుండి రంజాన్ నెల ప్రారంభం కావడం జరుగుతుందని, రంజాన్ …
Read More »పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి…
కామారెడ్డి, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సజావుగా, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 5 నుండి 25 వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో అన్ని …
Read More »25 వ సారి రక్తదానం చేయడం అభినందనీయం..
కామారెడ్డి, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న నర్సింగరావు (78) ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించారు. భిక్కనూర్ మండలం లక్ష్మీ దేవునిపల్లి గ్రామానికి చెందిన బద్దం నిశాంత్ రెడ్డి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి …
Read More »నేటి పంచాంగం
శనివారం, మార్చి.1, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : విదియ తెల్లవారుజామున 3.17 వరకువారం : శనివారం (స్ధిరవాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర మధ్యాహ్నం 2.06 వరకుయోగం : సాధ్యం రాత్రి 7.16 వరకుకరణం : బాలువ సాయంత్రం 4.22 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 3.17 వరకు వర్జ్యం : రాత్రి 10.59 – 12.29దుర్ముహూర్తము : ఉదయం 6.22 …
Read More »ఇంటర్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రవ్యాప్తంగా మార్చి 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు పోలీసు ఉన్నత అధికారులు, జిల్లా …
Read More »విద్యార్థులతో లెక్కలు చేయించిన కలెక్టర్
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా హార్డ్ వర్క్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రాత్రి భిక్కనూరు ప్రభుత్వ సాంఫీుక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. తొలుత కలెక్టర్ కు ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. పదవతరగతి విద్యార్థులను మాథ్స్లో లెక్కలను బోర్డు పై చేయించి …
Read More »విద్యాశాఖాధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షలు మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్టుమెంటు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12-30 …
Read More »ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలని, పనులు మంజూరై ప్రారంభించని వాటిని కన్వర్ట్ చేస్తూ సి సి రోడ్లు నిర్మించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శుక్రవారం అధికారులతో కలిసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, సమగ్ర కుటుంబ సర్వే, గ్రామీణ ప్రాంతాల్లో పన్నుల వసూళ్లు, ఎల్.ఆర్.ఎస్., త్రాగునీటి సౌకర్యాలు, ఇందిరమ్మ ఇండ్లు అంశాలపై ఎంపీడీఓలు, …
Read More »