Breaking News

Tag Archives: kamareddy

పేదింటి అమ్మాయి వివాహానికి పుస్తే, మట్టేల అందజేత…

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీలో నివాసముంటున్న తండ్రి లేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముత్యాల ప్రమీల కీర్తిశేషులు భూదయ్య కుమార్తె శిరీష వివాహానికి కావలసిన పుస్తె మట్టలను ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా ఆర్థిక సహాయంతో ఆదివారం అందజేశారని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు, కామారెడ్డి …

Read More »

మైనార్టీ నిరుపేదల జీవితాలలో వెలుగులు

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీ నిరుపేదల జీవితాలలో వెలుగులు నింపే విధంగా ప్రభుత్వం చేయూతనిస్తోందని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకం కింద మైనార్టీ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో చిన్న, చిన్న …

Read More »

జాతీయ భావం పెంపొందించేందుకే గాంధీ చిత్రం

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్యం నుంచే విద్యార్థులలో జాతీయ భావం పెంపొందించేందుకు జిల్లాలో గాంధీ చలన చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నామని అన్నారు. శనివారం కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, పిట్లం, నాగిరెడ్డిపేటలోని …

Read More »

పటిష్టమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు వజ్రాయుధం

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పటిష్టమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు వజ్రాయుధంలాంటిదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం నిజాంసాగర్‌ చౌరస్తా నుండి కళాభారతి వరకు ‘ఐ ఓట్‌ ఫార్‌ ష్యూర్‌ అంశమై నిర్వహించిన 5 కె -రన్‌ను జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా …

Read More »

పోస్ట్‌మాన్‌ నిర్లక్ష్యం… కుప్పలుగా విలువైన ఉత్తరాలు

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోస్ట్‌ మేన్‌గా విధులు నిర్వహిస్తున్న సీతారాం నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోస్ట్‌ ఆపీస్లో వచ్చిన విలువైన ఉత్తరాలు ఆధార్‌ కార్డులు, పాన్‌ కార్డులు, పాస్‌ పోర్టులు, ఏటీఎం కార్డులు, ఎల్‌ఐసి బాండ్లు ఇతర విలువైన ఉత్తరాలను గత 8 నెలలుగా పోస్టులో వచ్చిన ఉత్తరాలని వారికి ఇవ్వకుండా తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. పట్టణానికి …

Read More »

లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు అందించాలి

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు అర్హులైన లబ్దిదారులకు రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారంకలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు బ్యాంకులు 32 శాతం లక్ష్యాలను సాధించాయని, క్రెడిట్‌ ప్లాన్‌ లక్ష్యం మేరకు రెండవ త్రైమాసికం నాటికీ 50 శాతం లక్ష్యాలను సాధించేలా …

Read More »

జిల్లా అభివృద్ధిపై సమీక్ష…

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల గురించి సభలో పలువురు ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలు, ప్రశ్నలకు అధికారులు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించవలసినదిగా జిల్లా ప్రజా పరిషద్‌ చైర్‌ పర్సన్‌ ధఫెదార్‌ శోభ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని సమావేశమందిరంలో జెడ్పి చైర్‌ పర్సన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేసే ప్రజాప్రతినిధులకు సమస్యలు తెలుసునని, సభలో వారు …

Read More »

దేశభక్తిని పెంపొందించేందుకే గాంధీ చిత్ర ప్రదర్శన

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రదర్శిస్తున్న గాంధీ చిత్ర ప్రదర్శనలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు జిల్లాలో 9 థియేటర్ల ద్వారా 19,788 మంది విద్యార్థులు తిలకించారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్ర ప్రదర్శనలో భాగంగా నాల్గవ రోజైన శుక్రవారం 9 సినిమా హాళ్లలో 5,352 సీట్ల సామర్థ్యానికి గాను …

Read More »

బహుజన వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాటి పాలకుల అరాచకాలను అణిచివేసేందుకు పుట్టిన బహుజన వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సర్వాయి పాపాన్న జయంతి సందర్భంగా శుక్రవారం బి.సి.అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహనీయులు ఏ …

Read More »

ఇస్రో యువికాలో శిక్షణ పొందిన విద్యార్థినికి సన్మానం

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలం మాందాపూర్‌ గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పందిరి తన్విరెడ్డి ‘‘ఇస్రో యువికా 2023’’ స్కూల్‌ పిల్లల కోసం చేపట్టిన యువ విజ్ఞాన కార్యక్రమం యంగ్‌ సైంటిస్టుకు ఎంపికై 15 రోజులు శిక్షణ పొందిన తన్విరెడ్డి గురువారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా వైస్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »