నిజామాబాద్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో నీటి వినియోగం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలను పెంపొందించుకునే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్లో జల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్రీయ భూగర్భ జలబోర్డు అధికారులు జిల్లాలో భూగర్భ జలాల స్థితిగతుల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వ్యవసాయ …
Read More »తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలి
నిజామాబాద్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్, వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »పల్లె ప్రగతి స్పూర్తితో ముందుకు సాగాలి
నిజామాబాద్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని అధికారులందరూ పక్షం రోజులపాటు తీవ్రంగా శ్రమిస్తూ, సమిష్టి కృషితో మంచి ఫలితాలు సాధించగలిగారని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రశంసించారు. సోమవారం స్థానిక ప్రగతి భవన్లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధామ్యాలను గుర్తిస్తూ నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అంకిత భావంతో …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 74 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలనువిన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను వెంటదివెంట పరిశీలన జరుపుతూ, …
Read More »పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలి
నిజామాబాద్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టీ.హరీశ్ రావు సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 50 పడకల ఐసీయూ విభాగాన్ని, వృద్దుల కోసం నెలకొల్పిన లాలన కేంద్రాన్ని, స్కిల్ సెంటర్ను ప్రారంభించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఆనంతరం ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్ …
Read More »ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు
నిజామాబాద్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాన్య ప్రజానీకానికి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను అన్ని మెరుగైన వసతులతో అధునాతనంగా తీర్చిదిద్దిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. అన్ని వసతులతో అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. …
Read More »అట్టహాసంగా యోగా దినోత్సవ సన్నాహక పాదయాత్ర
నిజామాబాద్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 21 న జరుపుకోబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ప్రజల్లో యోగా చైతన్యాన్ని,అవగాహనను పెంపొందించడం కోసం నెహ్రూ యువ కేంద్ర మరియు ఆయాష్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన యోగ పాదయాత్ర అట్టహాసంగా జరిగిందని నెహ్రూ యువ కేంద్ర, నిజామాబాద్ జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ ఛైర్మెన్ దాదన్న …
Read More »ప్రతి నివాస ప్రాంతంలో క్రీడా ప్రాంగణం అందుబాటులోకి రావాలి
నిజామాబాద్, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి నివాస ప్రాంతంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి రావాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పల్లె ప్రగతి, హరితహారం తదితర కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్థలం లేనిచోట పాఠశాలలు, ఆలయాలు, గ్రామ చావిడి, కమ్యూనిటీ హాల్స్, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ, గ్రామాభివృద్ధి కమిటీ స్థలాలను క్రీడా ప్రాంగణాల …
Read More »మా ఊరి మహరాజులకు సన్మానం
నిజామాబాద్, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల అభివృద్ధిలో స్వచ్చందంగా భాగస్వాములవుతూ, ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా లక్ష రూపాయలకు పైబడి విరాళాలు అందించిన దాతలను మా ఊరి మహరాజులుగా గుర్తిస్తూ ప్రభుత్వపరంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించే పల్లె ప్రగతి ముగింపు సభల్లో ఘనంగా సన్మానించడం జరుగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం 16 మంది దాతలు లక్ష …
Read More »ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీని నియంత్రించాలి
నిజామాబాద్, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని నియంత్రించాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి (డి.ఈ.వో) కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం డీఈవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా …
Read More »