Tag Archives: nizamabad

టియు విద్యార్థులకు ఐటి హబ్‌లో మెరుగైన అవకాశాలు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో ఐటి హబ్‌ ఏర్పాటు చేస్తుండడంతో అర్బన్‌ ఎమెల్యే గణేష్‌ బిగాల, సోదరులు మహేష్‌ బిగాల నేతృత్వంలో శుక్రవారం వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హాజరయ్యారు. అమెరికాకు చెందిన వైటల్‌ గ్లోబల్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ నిజామాబాద్‌లో ఐటి …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

రెంజల్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం దండిగుట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పరిశీలించారు. కొనుగోలు కేంద్రం ఆవరణలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. బాగా ఆరబెట్టి శుభ్రపరిచిన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చి పూర్తిస్థాయి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. కాగా, ప్రతిరోజు ఎంత పరిమాణంలో వరి ధాన్యం …

Read More »

పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు రుణాల పంపిణీకి ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి కిసాన్‌ లబ్ధిదారులందరికీ రుణ సదుపాయం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నామని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 24 నుండి మే 1వ తేదీ వరకు ‘కిసాన్‌ భాగిదారి – ప్రాథమిక్తా హమారీ’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. లబ్దిదారులకు రుణ పంపిణీ ఏర్పాట్లపై కలెక్టర్‌ శుక్రవారం సంబంధిత అధికారులతో చర్చించారు. …

Read More »

ఉచిత వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం తరఫున అందిస్తున్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రెంజల్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరోగ్య మేళా నిర్వహించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ …

Read More »

బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామ్రేడ్‌ లెనిన్‌ 153 వ జయంతి, సి.పి.ఐ (ఎం.ఎల్‌) 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్‌.ఆర్‌ భవన్‌, కోటగల్లిలో జెండా ఆవిష్కరణ, కామ్రేడ్‌ విప్లవ నివాళులు అర్పించారు. ముందుగా పార్టీ జిల్లా కార్యదర్శి (ఇంచార్జి) వనమాల కృష్ణ ఎర్రజెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వనమాల కృష్ణ మాట్లాడుతూ పార్లమెంటరీ …

Read More »

నిజామాబాద్‌లో కళాశాల ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశానుసారం ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ డా. బి. విద్యావర్ధిని, జాయింట్‌ డైరెక్టర్‌ డా. బాలకిషన్‌ గురువారం ఉదయం ఎస్‌ఎస్‌ఆర్‌ డిగ్రీ, పీజీ కళాశాలలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఆర్‌ కళాశాలలపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడం వల్ల వీసీ ఆకస్మిక తనిఖీ నిర్వహించవలసిందిగా ఆదేశించారని అన్నారు. …

Read More »

మే 6 నుండి ఇంటర్‌ పరీక్షలు…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మే 6వ తేదీ నుండి 24 వ తేదీ మే వరకు కొనసాగుతాయని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్య అధికారి రఘు రాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఏర్పాటు, ప్రశ్నాపత్రాలను భద్రపరిచే ఏర్పాట్లు, తదితర సమస్యల పరిష్కారానికి …

Read More »

యూనియన్‌ స్థలం వైపు కన్నెత్తి చూస్తే ఖబర్దార్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) కు చెందిన 36 గంటల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న ఆకుల పాపయ్య దౌర్జన్యం నశించాలని యూనియన్‌ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో పిఎఫ్‌ కార్యాలయం నుండి యూనియన్‌ స్థలం వరకు ర్యాలీ చేసి, యూనియన్‌ స్థలంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) …

Read More »

రెవెన్యూ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ రెవిన్యూ సర్వీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కలెక్టరేట్లో ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేశారు. ముఖ్య ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ముస్లింలు, రెవెన్యూ అసోసియేషన్‌ ప్రతినిధులు, కలెక్టరేట్‌ ఉద్యోగులతో కలిసి ఇఫ్తార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో పవిత్రమైన రంజాన్‌ మాసంలో ముస్లిం సోదరులు నియమనిష్టలతో …

Read More »

రూరల్‌ తహశీల్‌ కార్యాలయంలో ధరణి హాల్‌ ప్రారంభం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ తహశీల్‌ – జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన ధరణి విభాగం భవనాన్ని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి గురువారం ప్రారంభోత్సవం చేశారు. అన్ని గదులను తిరుగుతూ వసతులను పరిశీలించారు. సందర్శకుల కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. తహశీల్‌ కార్యాలయం ఆవరణలో విరివిగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేస్తుండడాన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »