Tag Archives: nizamabad

పూర్తయిన కౌంటింగ్‌ సిబ్బంది మొదటి ర్యాండమైజెషన్‌ ప్రక్రియ

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్‌ సిబ్బంది మొదటి ర్యాండమైజెషన్‌ ప్రక్రియను ఆదివారం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో రిటర్నింగ్‌ అధికారుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ర్యాండమైజెషన్‌ ప్రక్రియ జరిపారు. …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, నవంబరు 26, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి మధ్యాహ్నం 3.12 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : భరణి మధ్యాహ్నం 2.12 వరకుయోగం : పరిఘము రాత్రి 2.30 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 3.12 వరకు తదుపరి విష్ఠి రాత్రి 2.41 వరకు వర్జ్యం : రాత్రి 2.00 – 3.35దుర్ముహూర్తము : సాయంత్రం …

Read More »

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల సందర్శన

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని ఆర్మూర్‌, పిప్రి తదితర ప్రాంతాల్లోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను బాల్కొండ, ఆర్మూర్‌ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు శక్తి శనివారం సందర్శించారు. ఆయా పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి స్థానికులను, అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొని ఉందని అధికారులు …

Read More »

నేటి పంచాంగం

శనివారం, నవంబరు 25, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి సాయంత్రం 4.36 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : అశ్విని మధ్యాహ్నం 2.58 వరకుయోగం : వ్యతీపాతం ఉదయం 7.04 వరకుకరణం : తైతుల సాయంత్రం 4.36 వరకు తదుపరి గరజి మధ్యాహ్నం 3.53 వరకు వర్జ్యం : ఉదయం 11.09 – 12.40 రాత్రి 12.15 …

Read More »

అదనపు కంట్రోల్‌ యూనిట్ల తరలింపు

నిజామాబాద్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ నుండి జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు అదనపు కంట్రోల్‌ యూనిట్లు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, నవంబరు 24, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి సాయంత్రం 6.21 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : రేవతి సాయంత్రం 4.04 వరకుయోగం : సిద్ధి ఉదయం 9.49 వరకుకరణం : బవ ఉదయం 7.22 వరకు తదుపరి బాలువ సాయంత్రం 6.21 వరకు ఆ తదుపరి కౌలువ తెల్లవారుజాము 5.28 వరకు వర్జ్యం : …

Read More »

ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌లో గోప్యత పాటీంచేలా పటిష్ట చర్యలు

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అర్హులుగా గుర్తించబడిన ఓటర్లకు సంబంధించి వారి ఇంటికే పోలింగ్‌ బృందాలు వెళ్లి ఓటు సేకరించే ప్రక్రియను కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం జిల్లాలోని నిజామాబాద్‌ అర్భన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌, బాన్సువాడ, ఆర్మూర్‌, బాల్కొండ సెగ్మెంట్ల …

Read More »

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన అబ్జర్వర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో గల పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సాధారణ పరిశీలకులు గౌతమ్‌సింగ్‌ గురువారం సందర్శించారు. ఓటింగ్‌ నిర్వహణకై పోలింగ్‌ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. కనీస సదుపాయాలైన టాయిలెట్స్‌, నీటి వసతి, ర్యాంపులు, విద్యుత్‌ సౌకర్యం వంటివి అందుబాటులో ఉన్నాయా? లేవా? అన్నది గమనించారు. అన్ని వసతులు అందుబాటులో ఉండడంతో సంతృప్తి …

Read More »

నేటి పంచాంగం

గురువారం, నవంబరు 23,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి రాత్రి 10.22 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర సాయంత్రం 5.25 వరకుయోగం : వజ్రం మధ్యాహ్నం 12.46 వరకుకరణం : వణిజ ఉదయం 9.28 వరకు తదుపరి భద్ర రాత్రి 10.22 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 4.44 – 6.14దుర్ముహూర్తము : ఉదయం 9.54 …

Read More »

187 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు

నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 187 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రిటర్నింగ్‌ అధికారి, నిజామాబాద్‌ ఆర్డీవో రాజేంద్ర కుమార్‌ తెలిపారు. పోలింగ్‌ నిర్వహణ విధులపై అవగాహన కల్పించేందుకు జిల్లా పరిధిలోని నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూర్‌, బాల్కొండ, బోధన్‌, బాన్సువాడ అసెంబ్లీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »